
Roja Vs Nagababu : రోజా VS నాగబాబు.. రోజా మాటలకి పళ్ళు పగలగొడతా అన్న నాగబాబు..!
Roja Vs Nagababu : ఏపీ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక అధికార పార్టీ వైఎస్సార్ సీపీని గద్దె దించడానికి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. మరోవైపు వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తమదైన శైలిలో దూసుకెళుతున్నారు. మినిస్టర్ రోజా జనసేన , టీడీపీ పొత్తు పై తీవ్ర విమర్శలు చేశారు. ఇన్ డైరెక్ట్ గా నాగబాబుపై ఆమె కామెంట్స్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ వస్తున్నాయంటే సంక్రాంతికి డూడూ బసవన్నలు ఎలా వస్తారో అలా చాలామంది వస్తారు. ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఇప్పుడూ నాలుగో కృష్ణుడు బయలుదేరాడు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
వీళ్లంతా వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోయడానికి వస్తున్నారు తప్ప అధికారంలో వస్తే ఏం చేస్తారో ప్రజలకు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే వాళ్లకు చేయాలన్న మంచి మనసు లేదు. కేవలం జగనన్నను ఓడించాలి అధికారంలోకి రావాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలకు ఏమి చేయాలో ఆలోచించుకుండా గుంపులు గుంపులుగా వస్తున్న ప్రతిపక్షాలను తరిమికొట్టాలని ప్రజలకు రోజా పిలుపునిచ్చారు. ఇక నాగబాబు మాట్లాడుతూ.. ప్రజలకు న్యాయం చేయలేని, ప్రజలకు సదుపాయాలను అందించలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి 2019లో వైఎస్సార్సీపీ అనే వైరస్ వచ్చింది. ఆ వైరస్ ను తొలగించడానికి జనసేన, టీడీపీ వ్యాక్సిన్ త్వరలోనే వస్తుందని అన్నారు.
వైయస్సార్ సీపీని గద్దె దించడానికి కాదు ప్రజలకు జరిగిన అన్యాయం గురించి పోరాడాలి. టీడీపీ సభ్యులు ఎక్కడ పోటీ చేసిన వారికి జనసైనికులు సపోర్టుగా ఉండాలి. అలాగే జనసేన సభ్యులు ఎక్కడ పోటీ చేసిన వారికి టీడీపీ సపోర్టుగా నిలబడాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకొని ముందుకు వెళితే విజయాన్ని సాధించగలుగుతాం. పొత్తులో విభేదాలను రాకుండా దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఓడించాలి అని అన్నారు. వైసీపీ నాయకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారు. ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంటూ నోటికి అదుపు లేకుండా వైసీపీ నాయకులు ఉన్నారు. ఇలాంటి వాళ్లను ఎన్నాళ్ళని భరిస్తాం. సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే వైసీపీ ప్రభుత్వం నశించాలి అని నాగబాబు చెప్పుకొచ్చారు.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.