
Roja Vs Nagababu : రోజా VS నాగబాబు.. రోజా మాటలకి పళ్ళు పగలగొడతా అన్న నాగబాబు..!
Roja Vs Nagababu : ఏపీ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక అధికార పార్టీ వైఎస్సార్ సీపీని గద్దె దించడానికి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. మరోవైపు వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తమదైన శైలిలో దూసుకెళుతున్నారు. మినిస్టర్ రోజా జనసేన , టీడీపీ పొత్తు పై తీవ్ర విమర్శలు చేశారు. ఇన్ డైరెక్ట్ గా నాగబాబుపై ఆమె కామెంట్స్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ వస్తున్నాయంటే సంక్రాంతికి డూడూ బసవన్నలు ఎలా వస్తారో అలా చాలామంది వస్తారు. ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఇప్పుడూ నాలుగో కృష్ణుడు బయలుదేరాడు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
వీళ్లంతా వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోయడానికి వస్తున్నారు తప్ప అధికారంలో వస్తే ఏం చేస్తారో ప్రజలకు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే వాళ్లకు చేయాలన్న మంచి మనసు లేదు. కేవలం జగనన్నను ఓడించాలి అధికారంలోకి రావాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలకు ఏమి చేయాలో ఆలోచించుకుండా గుంపులు గుంపులుగా వస్తున్న ప్రతిపక్షాలను తరిమికొట్టాలని ప్రజలకు రోజా పిలుపునిచ్చారు. ఇక నాగబాబు మాట్లాడుతూ.. ప్రజలకు న్యాయం చేయలేని, ప్రజలకు సదుపాయాలను అందించలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి 2019లో వైఎస్సార్సీపీ అనే వైరస్ వచ్చింది. ఆ వైరస్ ను తొలగించడానికి జనసేన, టీడీపీ వ్యాక్సిన్ త్వరలోనే వస్తుందని అన్నారు.
వైయస్సార్ సీపీని గద్దె దించడానికి కాదు ప్రజలకు జరిగిన అన్యాయం గురించి పోరాడాలి. టీడీపీ సభ్యులు ఎక్కడ పోటీ చేసిన వారికి జనసైనికులు సపోర్టుగా ఉండాలి. అలాగే జనసేన సభ్యులు ఎక్కడ పోటీ చేసిన వారికి టీడీపీ సపోర్టుగా నిలబడాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకొని ముందుకు వెళితే విజయాన్ని సాధించగలుగుతాం. పొత్తులో విభేదాలను రాకుండా దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఓడించాలి అని అన్నారు. వైసీపీ నాయకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారు. ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంటూ నోటికి అదుపు లేకుండా వైసీపీ నాయకులు ఉన్నారు. ఇలాంటి వాళ్లను ఎన్నాళ్ళని భరిస్తాం. సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే వైసీపీ ప్రభుత్వం నశించాలి అని నాగబాబు చెప్పుకొచ్చారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.