
Lagadapati Rajagopal : పవన్ కళ్యాణ్ ని టచ్ చేసే దమ్ము జగన్ కి లేదు ... ఏపీ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన లగడపాటి రాజగోపాల్..
Lagadapati Rajagopal : ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుస్తారు అనేదానిపై ఉత్కంఠత రేపింది. ఈ క్రమంలోనే వై.యస్.జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థుల ఖరారును వేగవంతం చేస్తున్నారు. టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని జగన్ ను ఓడించాలనే ధీమాతో ఉంది. ఇక కాంగ్రెస్ లోకి వై.యస్.షర్మిల ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ గా మారారు. కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని మాజీలను ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలోనే ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏపీలో ఎన్నికల పోరుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత లగడపాటి రాజకీయాలపై స్పందించారు. పూర్తిగా వ్యాపారాలకి పరిమితమైన లగడపాటి తాజాగా రాజమండ్రి వచ్చారు. మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ తో సమావేశం అయ్యారు. లగడపాటి టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆయన స్పందించారు.
తను మళ్లీ రాజకీయాలలోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. గతంలో లగడపాటి సర్వేలకు ప్రాచుర్యం ఉండేది. 2019 ఎన్నికల్లో లగడపాటి సర్వే అంచనాలు తప్పడంతో అప్పటినుంచి ఆయన సర్వేలకు దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఏపీ ఎన్నికలు హోరాహోరీగా కనిపిస్తున్న సమయంలో ఆయన ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్నికల సమరం ఉంటుందని స్పష్టం చేశారు. తమిళనాడు తరహాలోనే ఏపీలో ఎన్నికల రాజకీయం ఉంటుందని అన్నారు. జాతీయ పార్టీలకు అవకాశం లేదని చెప్పారు. తాను ఎలాంటి సర్వేలు చేయడం లేదన్నారు. ప్రజల ఆలోచన ఏంటనేది మాత్రం గుర్తించడం కష్టమని చెప్పారు. ఏపీలో షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. షర్మిల ఎంట్రీ తో జగన్ ఓటింగ్ చీలిక తమకు మేలు జరుగుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు
అయితే షర్మిల రాకతో జగన్ వ్యతిరేక ఓటు మాత్రమే చీలుతుంది అనేది వైసీపీ ముఖ్య నేతల విశ్లేషణ. తాము పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ పైన నమ్మకంతో ఉన్నామని చెబుతున్నారు. లగడపాటి అంచనాలతో ఏపీలో షర్మిలకు కాంగ్రెస్ వలన ఎటువంటి ప్రయోజనం లేదనే విధంగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఎన్నికల ముందు కంటే తర్వాత ఎన్డీఏలో చేరితే ప్రయోజనం అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అటు పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో వెళ్లడమే ప్రయోజనకరమని భావిస్తున్నారు. దీంతో బీజేపీ నుంచి ఒక స్పష్టత కోసం వేచి చూస్తున్నారు. ఇక జగన్ ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగుతున్నారు. ఈసారి గెలుపు పార్టీలకంటే జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
This website uses cookies.