Lagadapati Rajagopal : పవన్ కళ్యాణ్ ని టచ్ చేసే దమ్ము జగన్ కి లేదు … ఏపీ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన లగడపాటి రాజగోపాల్..

Lagadapati Rajagopal : ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుస్తారు అనేదానిపై ఉత్కంఠత రేపింది. ఈ క్రమంలోనే వై.యస్.జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థుల ఖరారును వేగవంతం చేస్తున్నారు. టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని జగన్ ను ఓడించాలనే ధీమాతో ఉంది. ఇక కాంగ్రెస్ లోకి వై.యస్.షర్మిల ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ గా మారారు. కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని మాజీలను ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలోనే ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏపీలో ఎన్నికల పోరుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత లగడపాటి రాజకీయాలపై స్పందించారు. పూర్తిగా వ్యాపారాలకి పరిమితమైన లగడపాటి తాజాగా రాజమండ్రి వచ్చారు. మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ తో సమావేశం అయ్యారు.  లగడపాటి టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆయన స్పందించారు.

తను మళ్లీ రాజకీయాలలోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. గతంలో లగడపాటి సర్వేలకు ప్రాచుర్యం ఉండేది. 2019 ఎన్నికల్లో లగడపాటి సర్వే అంచనాలు తప్పడంతో అప్పటినుంచి ఆయన సర్వేలకు దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఏపీ ఎన్నికలు హోరాహోరీగా కనిపిస్తున్న సమయంలో ఆయన ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్నికల సమరం ఉంటుందని స్పష్టం చేశారు. తమిళనాడు తరహాలోనే ఏపీలో ఎన్నికల రాజకీయం ఉంటుందని అన్నారు. జాతీయ పార్టీలకు అవకాశం లేదని చెప్పారు. తాను ఎలాంటి సర్వేలు చేయడం లేదన్నారు. ప్రజల ఆలోచన ఏంటనేది మాత్రం గుర్తించడం కష్టమని చెప్పారు. ఏపీలో షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. షర్మిల ఎంట్రీ తో జగన్ ఓటింగ్ చీలిక తమకు మేలు జరుగుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు

అయితే షర్మిల రాకతో జగన్ వ్యతిరేక ఓటు మాత్రమే చీలుతుంది అనేది వైసీపీ ముఖ్య నేతల విశ్లేషణ. తాము పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ పైన నమ్మకంతో ఉన్నామని చెబుతున్నారు. లగడపాటి అంచనాలతో ఏపీలో షర్మిలకు కాంగ్రెస్ వలన ఎటువంటి ప్రయోజనం లేదనే విధంగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఎన్నికల ముందు కంటే తర్వాత ఎన్డీఏలో చేరితే ప్రయోజనం అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అటు పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో వెళ్లడమే ప్రయోజనకరమని భావిస్తున్నారు. దీంతో బీజేపీ నుంచి ఒక స్పష్టత కోసం వేచి చూస్తున్నారు. ఇక జగన్ ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగుతున్నారు. ఈసారి గెలుపు పార్టీలకంటే జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి

Recent Posts

Coffee : అధిక బరువు ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం… ఒంట్లో కొవ్వు ఇట్లే కరుగుతుంది…?

Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…

35 minutes ago

Zodiac Signs : ఈ రాశుల వారికి 64 సంవత్సరాల తరువాత అఖండ ధనయోగం… శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం…?

Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…

2 hours ago

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

11 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

12 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

13 hours ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

14 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

15 hours ago

Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…

16 hours ago