High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!
ప్రధానాంశాలు:
High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు జడ్జి జస్టిస్ నిర్జర్ ఎస్. దేశాయ్ ఒక క్రిమినల్ కేసు విచారిస్తుండగా, ఫిర్యాదుదారుడు టాయిలెట్ సీట్పై కూర్చుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యాడు. ఇది కోర్టు గౌరవాన్ని తక్కువ చేస్తుందని, అత్యంత అవమానకరమైన ఘటనగా న్యాయవాదుల పేర్కొంటున్నారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, వర్చువల్ విధానాల ఉపయోగంపై మరింత నిర్దిష్ట నియమాలు అవసరమన్న చర్చ మొదలైంది.

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!
High Court టాయిలెట్ లో కూర్చుని హైకోర్టులో విచారణకు వర్చువల్ గా హాజరైన ఓ వ్యక్తి
ఇదే విధంగా ఇటీవల మరో ఘటనలో వర్చువల్ విచారణ సందర్భంగా ఓ వ్యక్తి కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో సిగరెట్ తాగుతూ కనిపించాడు. దీనిపై గుజరాత్ హైకోర్టు తీవ్రంగా స్పందించి అతడికి రూ.50 వేల జరిమానా విధించింది. ఈ తరహా ఘటనలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని న్యాయవాదులు, న్యాయనిర్ణేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్చువల్ కోర్ట్ వ్యవస్థ కోవిడ్ తర్వాత న్యాయ వ్యవస్థలో ఓ ప్రధాన మార్గంగా మారింది.
కానీ దీనిని మర్యాదగా వినియోగించకుండా, తగిన గౌరవం ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. న్యాయ వ్యవస్థను అవమానించేలా వ్యవహరిస్తే కేవలం జరిమానాలే కాదు, తదుపరి విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి రావచ్చు. ప్రజలు, న్యాయసేవలు పొందేవారు, వర్చువల్ ప్లాట్ఫామ్ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ న్యాయస్థానాల గౌరవాన్ని కాపాడే విధంగా ప్రవర్తించాలని కోర్టులు సూచిస్తున్నాయి.