
Modi : ప్రజాగలం సభలో నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు..!
Modi : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ జనసేన మరియు బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మూడు పార్టీలకు చెందిన అధినేతలు చిలకలూరిపేటలోని బొప్పూడి లో ప్రజాగలం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇక ఈ భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఇక ఈ భారీ బహిరంగ సభకు మూడు పార్టీలకు చెందిన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ఈ భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ముందుగా తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ ప్రారంభించారు. అదేవిధంగా సీనియర్ ఎన్టీఆర్ మరియు మాజీ ప్రధాని పీవీ నరసింహారావును నరేంద్ర మోడీ స్మరించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని కీర్తించారు. ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడు మరియు రాముడు పాత్రలలో ఒదిగిపోయి నటించేవారని అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట రోజు అదే గుర్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
రైతుల కోసం పేదల కోసం ఎన్టీఆర్ గారు చాలా పోరాడారని అందుకే ఆయన శతజయంతి ఉత్సవాలలో నాణెం విడుదల చేశామని తెలిపారు. అనంతరం మోడీ తన ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనపై చరమగీతం పాడాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రితో పాటు ఏపీ మంత్రులు కూడా అవినీతి అక్రమాలతో పోటీపడుతున్నారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్న వైయస్ జగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరు వేరు కాదని ఈ రెండు పార్టీలని నడుపుతుంది ఒకే కుటుంబానికి చెందిన వారిని అది ప్రజలు గమనించాల్సిందిగా తెలియజేశారు. అదేవిధంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిచే విధంగా కృషి చేయాలని అప్పుడే వికాసిత భారత్ తో పాటు వికాసిత ఆంధ్ర రాష్ట్రాన్ని చూడడం సాధ్యమవుతుందని తెలిపారు.
కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేసే ముందు కచ్చితంగా రెండు సంకల్పాలను గుర్తుపెట్టుకోవాలని ఒకటి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడో సారీ స్థానం సంపాదించడం ,రెండవది రాష్ట్రంలో అవినీతి వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడాలి. ఈ రెండు సంకల్పాలను గుర్తు పెట్టుకొని ఓటు వేయాల్సిందిగా నరేంద్ర మోడీ తెలియజేశారు. ఇక జగన్ పాలనలో ఏపీ లో ఐదేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని దేశంతో పాటు ఏపీ కూడా అభివృద్ధి కావాలని కోరుకునేవారు ముందుకు వచ్చి ఓటు వేయాల్సిందిగా తెలియజేశారు. ఇక రాబోయే 5 సంవత్సరాలు చాలా కీలకమైనవిగా చెప్పుకొచ్చారు. ఎన్డీఏ తోనే రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి పేదల సంక్షేమం సాధ్యమవుతుందని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ పార్టీ పన్నాగాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు ఎన్డీఏకు ఓటు వేయాల్సిందిగా ప్రధాని పిలుపునిచ్చారు.
Karthika Deepam 2 March 13th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న అత్యంత ప్రజాదరణ…
Laddulu : తెలుగు సంప్రదాయ వంటకాలలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నది…
Fruits for Hydration : వేసవి కాలం మొదలైతేనే ఎండల తీవ్రత పెరిగి శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. అధిక…
Ugadi astrology, : ఉగాది పండుగతో తెలుగు సంవత్సరానికి శ్రీకారం చుడతారు. కొత్త పంచాంగం ప్రకారం సంవత్సర ఫలితాలను జ్యోతిష్యులు…
YS Jagan : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. గత…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సంచలనంగా మారారు. గత ఎన్నికల్లో కూటమిని గెలిపించడంలో ఆయన…
AP Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఉగాది పండుగ ఒక పెద్ద మార్పుకు వేదిక కాబోతోంది. రాష్ట్ర రాజకీయ…
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువుల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.…
LPG Crisis : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భారత్లో కూడా…
Viral news : మహాకుంభ్ మేళాలో తీయించుకున్న ఫొటోలతో ఒక్క రాత్రిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయి దేశవ్యాప్తంగా గుర్తింపు…
Hyderabad : హైదరాబాద్లోని వృత్తిదారుల భవనంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కల్లుగీత కార్మిక సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…
This website uses cookies.