no ticket to ycp leaders family members in ap
YSRCP : రాజకీయాలు అంటేనే వారసత్వం ఉంటుంది. వారసత్వం లేని రాజకీయాలు ఉండవు. ఏదో ఒక పార్టీలో దాన్ని మనం చూస్తూనే ఉంటాం. రాజకీయ నాయకులు చాలా ఏళ్లు ఒక పార్టీ కోసం పని చేశాక.. తమ వారసులు కూడా ఆ పార్టీలో మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటారు. అది సహజం. వారసత్వ రాజకీయాలు అనేవి ఇప్పుడే పుట్టుకొచ్చినవి కావు. అవి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. ఇందిరా గాంధీ హయాం నుంచి వారసత్వ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి.
చివరకు తెలంగాణలోనూ వారసత్వ రాజకీయాలే ఇప్పటికీ రాజ్యమేలుతున్నాయి. అయితే.. అటువంటి రాజకీయాలకు చెక్ పెట్టాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి చాలామంది వైసీపీ సీనియర్ నాయకులు తమ కొడుకులను, కూతుళ్లను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అందులో మంత్రులు కూడా ఉన్నారు. కానీ.. వైసీపీలో వారసులకు నో టికెట్ అనే రూల్ అప్లయి చేయాలని సీఎం జగన్ చూస్తున్నట్టు తెలుస్తోంది.ఈ విషయంలో సీఎం జగన్ మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే.. వైసీపీలో ఇప్పుడు ఉన్నదంతా యువ రక్తమే. యువకులే పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. పార్టీ పుట్టి కూడా పెద్దగా దశాబ్దాలు కాలేదు. కాబట్టి ఇప్పుడే వారసులకు టికెట్లు అవసరం లేదు అనే భావనలో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.
no ticket to ycp leaders family members in ap
మరోవైపు తమ వారసులకు టికెట్లు కావాలని వైసీపీలో చాలామంది నేతలు క్యూ కడుతున్నారట. కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోతే అది అసంతృప్తికి దారి తీసే అవకాశం ఉంది. పార్టీలోనే అంతర్గత విభేదాలకు దారి తీసే అవకాశం ఉన్నందున 2024 ఎన్నికల్లో అయితే వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని తెగేసి చెప్పేయాలని సీఎం జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంత పెద్ద లీడర్ అయినా, సీనియర్ లీడర్ అయినా ఒకటే సమాధానం అని అందరికీ స్పష్టం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారట. చూద్దాం మరి టికెట్లు ఆశించిన లీడర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో?
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.