Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్యం పై ఆందోళన..!
Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో అతడు చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలు కాగా, పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Pawan Kalyan Son : పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్యం పై ఆందోళన..!
ఈ సమాచారం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తక్షణమే ఆందోళనకు గురయ్యారు. కానీ ప్రస్తుతం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉండగా అక్కడి గిరిజన గ్రామమైన కురిడి కి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటానని వారికి మాట ఇచ్చిన కారణంగా, తన పర్యటన ముగించాకే సింగపూర్ వెళ్లుతానని తెలిపారు. అధికారుల సూచనల ప్రకారం తక్షణమే వెళ్లాలని చెప్పినా, పవన్ ప్రజలతో ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ముందుగా తన పర్యటన పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు.
ఇతీవలే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న నేపథ్యంలో వాటిని పూర్తిచేసి విశాఖపట్నం ఎయిర్పోర్టు ద్వారా సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ భార్య అనా లెజ్నోవా సింగపూర్ చేరుకున్నారు. ఆమె సంతతంగా మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై పవన్కు సమాచారం అందిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రార్థనలు చేస్తూ, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Kalpika Ganesh : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి నటి కల్పిక సుపరిచితమే. రెగ్యులర్ గా తన ఫోటోలు,…
jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ…
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.…
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…
Business : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…
Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…
Ration : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్…
This website uses cookies.