
TDP
అమరావతి : పొలిటికల్ స్ట్రాటజిస్ట్. అంటే రాజకీయ వ్యూహకర్త. ప్రస్తుత రాజకీయాల్లో వీరు పోషిస్తున్న పాత్ర మన కళ్లముందున్నదే. పవర్ను నిలుపుకునేందుకు అధికారపక్షం, ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్షం ఇరుపక్షాలు వీరిపై ఎంతగా ఆధారపడుతున్నాయో మనం చూస్తున్నదే. ప్రశాంత్ కిశోర్.. దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించి జగన్ ఏ విధంగా అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడింది తెలిసిందే. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఈయన శిష్యుడు రాబిన్ శర్మను టీడీపీ తమ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది. గత కొంతకాలంగా రాబిన్ నేతృత్వంలోనే టీడీపీ యాక్షన్ కొనసాగుతుంది. తిరుపతి లోక్సభ ఎన్నికల్లో కాస్త యాక్టివ్ అయిన ఆ పార్టీ రాజకీయాలు ప్రస్తుతం ఊపందుకున్నాయి.
tdp
స్తంభంగా ఉంటే జనాలు తమని మర్చిపోతారనో, ఆ మాత్రం ప్రతిపక్ష హోదా కూడా మిగలదనో లేదా మళ్లా ఎన్నికల సమయానికి కనుమరుగే అవుతామనో భయంతోనో ఏదైతేనేం మొత్తంమీద క్రీయాశీలకంగా మారుతున్నారు. రాబిన్ డైరెక్షన్ ప్లాన్కు చంద్రబాబు నాయుడు యాక్షన్ దూకుడును జోడించారు. అందుకే ఏ మాత్రం సందు దొరికినా దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు పాలనా వైఫల్యాన్ని ఎండగడుతూనో, ప్రజా సమస్యలను నెత్తికొత్తుకునో కాకుండా విమర్శలను ఆలంభనగా చేసుకున్నారు. పాజిటివ్ కంటే నెగెటివ్ జనాల్లోకి తొందరగా వెళ్తుందని ఇందుకు కారణమై ఉండొచ్చు. నేటి సమాచార యుగంలో పాపులర్, అన్పాపులర్ కావాలన్న క్షణాల్లో జరిగిపోతుంది. ఒకవైపు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు, మరోవైపు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాతో ఓ అంశాన్ని జనాల్లోకి క్షణాల్లో జొప్పించి చర్చకు పెడుతున్నారు. ప్లస్ అయితేనేం, మైనస్ అయితేనేం మొత్తం మీద మేము క్రీయాశీలంగా ఉన్నామంటూ తమ ఉనికి చాటుకుంటున్నారు. పట్టాభి అంశమే ఇందుకు ఉదాహరణగా మనం చూడొచ్చు.
chandrababu naidu
రాబిన్ డైరెక్షన్లోనే పట్టాభి సీఎంపై తీవ్ర విమర్శలు చేసినట్లుగా సమాచారం. అనుకున్న విధంగానే వైసీపీ శ్రేణులు స్పందించి ప్రతివిమర్శలు, దాడులు చేశారు. తాము ఆశించిన ఫలితం వచ్చిందన్నట్టుగా చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై వెంటనే గవర్నర్తో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖలు రాయడం, 36 గంటల దీక్ష, ఢిల్లీ టూర్ ఇలా వరుసగా దూసుకుపోతున్నారు. ఇదంతా రాబిన్ శర్మ డైరెక్షన్లో కొనసాగుతున్న యాక్షన్గా సమాచారం.
BRS Party : మిర్యాలగూడ miryalaguda పట్టణం సీతారాంపురం (42వ వార్డు) మాజీ కౌన్సిలర్ చిదెళ్ళ సత్యవేణి – వెంకటేశ్వర్లు…
Corporator Venkatesh Goud : 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారి లోని ఇందిరాగాంధీ స్టేట్యూ…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్, 9వ డివిజన్ మేడిపల్లిలోని సుమా రెసిడెన్సీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేట్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 9 వ డివిజన్ మేడిపల్లి ధరణి కాలనీ అసోసియేషన్ ఎన్నికలు…
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ central government వాటా ఖరారయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.…
Vivo V23 Max Review : స్మార్ట్ఫోన్ SmartPhone మార్కెట్లో స్టైలిష్ డిజైన్స్, అద్భుతమైన కెమెరాలకు పెట్టింది పేరు వివో…
Gas Cylinder : ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ అంటే మన కళ్లముందు ఒకే చిత్రం కనిపించేది. ఎరుపు రంగులో ఇనుముతో…
AP 2029 Elections : ఏపీ రాజకీయ ముఖచిత్రం 2029 ఎన్నికల నాటికి సమూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం…
This website uses cookies.