Chandrababu : చంద్ర‌బాబుపై కాంగ్రెస్ ప్ర‌శంస‌ల జ‌ల్లు.. భ‌విష్య‌త్‌లోఇలా ముందుకు వెళ్లాలంటూ సూచ‌న‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : చంద్ర‌బాబుపై కాంగ్రెస్ ప్ర‌శంస‌ల జ‌ల్లు.. భ‌విష్య‌త్‌లోఇలా ముందుకు వెళ్లాలంటూ సూచ‌న‌..!

Chandrababu : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో ఏపీకి చంద్రబాబు ముఖ్య‌మంత్రి అయ్యాడు. ఆయ‌న త‌న‌దైన శైలిలో ప్ర‌జా సేవ చేసుకుంటూ ముందుకు వెళ‌తున్నాడు. కెరీర్‌లో నాలుగోసారి సీఎం అయిన చంద్ర‌బాబు ఇప్పుడు ఏపీని అభివృద్ధి చేసే ప‌నిలో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ నాయ‌కులు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలంటే ఒకప్పుడు ఉప్పూనిప్పూగా ఉండేవి. టీడీపీ ఏర్పడిందే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. ఇక మారిన […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 August 2024,1:00 pm

Chandrababu : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో ఏపీకి చంద్రబాబు ముఖ్య‌మంత్రి అయ్యాడు. ఆయ‌న త‌న‌దైన శైలిలో ప్ర‌జా సేవ చేసుకుంటూ ముందుకు వెళ‌తున్నాడు. కెరీర్‌లో నాలుగోసారి సీఎం అయిన చంద్ర‌బాబు ఇప్పుడు ఏపీని అభివృద్ధి చేసే ప‌నిలో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ నాయ‌కులు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలంటే ఒకప్పుడు ఉప్పూనిప్పూగా ఉండేవి. టీడీపీ ఏర్పడిందే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. ఇక మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈ పార్టీలు రెండూ దగ్గరయ్యాయి. ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు.

Chandrababu బాబుపై ప్ర‌శంస‌లు..

చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. మడకశిర మండలం గుండుమల గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు. మడకశిరలో చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమంపై మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం ప్రజలను బలవంతంగా తరలించడం, నిర్బంధించడం వంటివి లేవని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు . ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ఇలా సాదాసీదాగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగించాలని సూచించారు. మరోవైపు మడకశిర నియోజకవర్గంలో పదేళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న రైతుల సమస్యలు, తాగు, సాగునీటిపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని రఘువీరారెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రకటన పట్ల మడకశిర వాసిగా హర్షిస్తున్నానని అన్నారు.

Chandrababu చంద్ర‌బాబుపై కాంగ్రెస్ ప్ర‌శంస‌ల జ‌ల్లు భ‌విష్య‌త్‌లోఇలా ముందుకు వెళ్లాలంటూ సూచ‌న‌

Chandrababu : చంద్ర‌బాబుపై కాంగ్రెస్ ప్ర‌శంస‌ల జ‌ల్లు.. భ‌విష్య‌త్‌లోఇలా ముందుకు వెళ్లాలంటూ సూచ‌న‌..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మడకశిరకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా కూటమి ప్రభుత్వానికి శక్తిని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన ప్రజా వ్యతిరేక విధానాలకు ముఖ్యమంత్రి స్వస్తి చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఇక మడకశిరలో రూ.60 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే ఈ ప్రాంతంలో రెండు రిజర్వాయర్లు కడతామని చంద్రబాబు ప్రకటించారు. బిందు సేద్యం విధానం అమలు సహా నూతనంగా పరిశ్రమలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది