Ration Card : ప్రజలకు గుడ్‌న్యూస్.. రేషన్ కార్డు సేవల్లో భారీ మార్పులు..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 June 2026,9:45 pm

ప్రధానాంశాలు:

  •  Ration Card : ప్రజలకు గుడ్‌న్యూస్.. రేషన్ కార్డు సేవల్లో భారీ మార్పులు..!

Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పు, తొలగింపు ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే అందించేందుకు ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్‌ను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సేవలను మరింత సమర్థవంతంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి.. పౌర సేవల అందుబాటుపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.

Ration Card : ప్రజలకు గుడ్‌న్యూస్.. రేషన్ కార్డు సేవల్లో భారీ మార్పులు..!

Ration Card : ప్రజలకు గుడ్‌న్యూస్.. రేషన్ కార్డు సేవల్లో భారీ మార్పులు..!

Ration Card రేషన్ కార్డు సేవల్లో కీలక మార్పులు

రాష్ట్రంలో అనేక కుటుంబాలు రేషన్ కార్డుల విభజన, సభ్యుల పేర్ల చేర్పు, తొలగింపు వంటి సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రజలు తక్కువ సమయంలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు పొందేలా విధానాలను రూపొందించాలని సూచించారు. కుటుంబ విభజనల నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీ, వివాహం లేదా ఇతర కారణాల వల్ల సభ్యుల పేర్ల చేర్పు, తొలగింపు వంటి అంశాలను వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Ration Card : డేటా లేక్ పనులు జూలై నాటికి పూర్తి చేయాలి

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై సమీకరించేందుకు చేపట్టిన ‘డేటా లేక్’ ప్రాజెక్టును వేగవంతం చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. జూలై నెలాఖరు నాటికి ఈ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా అందించడంలో డేటా లేక్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. శాఖల మధ్య సమాచార మార్పిడి సులభతరం కావడం ద్వారా ప్రజలకు సేవలు త్వరగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు.కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మంత్రి సమీక్షించారు. ధ్రువీకరణ పత్రాల మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.అభ్యర్థులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని, అవసరమైన సాంకేతిక పరిష్కారాలను అమలు చేయాలని ఆదేశించారు.

Ration Card మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌పై విస్తృత ప్రచారం

ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా అందించేందుకు ప్రారంభించిన ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ వినియోగాన్ని మరింత పెంచాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.ఈ సేవల గురించి ప్రజల్లో ఇంకా పూర్తి అవగాహన లేదని పేర్కొంటూ, నెల రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సేవల వివరాలను తెలియజేయాలని సూచించారు.మనమిత్ర ద్వారా ఇప్పటికే అనేక ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండగా, రాబోయే రోజుల్లో మరిన్ని సేవలను ఈ వేదికలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

డిజీ వెరిఫై ద్వారా సర్టిఫికెట్ల ధ్రువీకరణ

విద్యార్థులు, ఉద్యోగార్థులు సమర్పించే విద్యా, క్రీడా సర్టిఫికెట్ల ధ్రువీకరణలో పారదర్శకత తీసుకురావాలని మంత్రి లోకేష్ సూచించారు.విద్యాసంస్థలు, క్రీడా సంస్థలు జారీ చేసే అన్ని సర్టిఫికెట్లను అభ్యర్థుల ఆధార్ నంబర్ ఆధారంగా డిజీ వెరిఫై వ్యవస్థ ద్వారా పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.దీంతో నకిలీ సర్టిఫికెట్ల వినియోగాన్ని అరికట్టడంతో పాటు, ఎంపిక ప్రక్రియల్లో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ సరఫరా అంశాలపై కూడా మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాబోయే కాలంలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సింగపూర్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులతో భేటీ

ఇదిలా ఉంటే, ఇటీవల సింగపూర్ విద్యా పర్యటనకు వెళ్లిన రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులతో కూడా మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు.ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 37 మంది టీచర్లు సింగపూర్‌లో అక్కడి విద్యావిధానాలను అధ్యయనం చేసి తిరిగి వచ్చారు. ఉండవల్లిలోని తన నివాసంలో వారితో సమావేశమైన మంత్రి, వారు తెలుసుకున్న అంశాలపై చర్చించారు.సింగపూర్‌లో అమలవుతున్న విద్యా విధానాల్లో రాష్ట్రంలో అమలు చేయగల అంశాలపై ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విదేశాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు రాష్ట్ర విద్యారంగంలో మార్పులకు దారితీసే ‘ఛేంజ్ మేకర్స్’గా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.ప్రభుత్వం విద్యారంగ సంస్కరణలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఉపాధ్యాయుల అనుభవాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి