Roja : ఈసారి న‌గ‌రి నుంచి కాదు.. ఎంపీ బ‌రిలో రోజా..?

Advertisement
Published by
Advertisement

Roja : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమర శంఖం పూరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరు ఊహించని విధంగా అభ్యర్థుల ఎంపికలో జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 60 మంది అభ్యర్థుల స్థానాలను మార్చిన సీఎం జగన్…తుది జాబితా పై కూడా కసరత్తు మొదలుపెట్టారు. ఇక దీనిలో భాగంగానే ఎంపీల జాబితా ఎట్టకేలకు సిద్ధమైంది. అయితే ప్రస్తుతం మాజీమంత్రి రోజాపై నగరిలో సొంత పార్టీ వైసీపీ నుండి వ్యతిరేకత కనిపిస్తుంది. దీంతో నగరి నుండి రోజాను మార్చేసి పార్లమెంట్ బరిలో దించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తే అభ్యర్థులను ఎంపిక చేస్తున్న జగన్ ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సీటు లేకుండానే చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి బాలినేని ఇప్పటికీ మాగుంట సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.అదేవిధంగా జిల్లాలో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక ఒంగోలు పార్లమెంటు స్థానానికి ఒక దశలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వినిపించగా జిల్లా నేతల నుండి సానుకూలత కనిపించలేదు. దీంతో మరో అభ్యర్థి కోసం పార్టీ నేతలు అన్వేషించారు. ఈ నేపథ్యంలోనే నగరి నుంచి మంత్రి రోజా పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికే చెవిరెడ్డి కుమారుడు మోహిత్ కు చంద్రగిరి అసెంబ్లీ స్థానం కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో చెవిరెడ్డికి సీటు ఇస్తే ఒకే కుటుంబం నుండి రెండు సీట్లు ఆశిస్తున్న అభ్యర్థులు అభిప్రాయ వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పార్టీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజాను ఒంగోలు పార్లమెంట్ కు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజా అభ్యర్థిత్వంపై జిల్లా నేతలతో పార్టీ సమన్వయకర్త సాయి రెడ్డి చర్చించడం జరిగింది. ఇక జిల్లా నేతల నుండి సానుకూలత కనిపించడంతో రోజాను ఒంగోలు ఎంపీగా బరిలో దించేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక బాలినేని , బూచేపల్లి వంటి నేతలు మరోసారి సీటు కేటాయింపు పై సీఎంతో మాట్లాడాలని భావిస్తున్నారు. ఇక ఈ విషయంపై ముందుగా సాయి రెడ్డితో చర్చించిన వేళ రోజా పేరు పరిశీలిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.రోజాతో కూడా ఇప్పటికే ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. ఇక ఈ విషయంపై మంత్రి రోజా జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారట. దీంతో నరసరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు ఒంగోలు నుండి మంత్రి రోజా ఖరారు పై సోమవారం సీఎం జగన్ తుది నిర్ణయం తెలియజేసే అవకాశం ఉంది.ఇక ఇదే సమయంలో రోజా ను నగరి నుంచి మార్చి అక్కడ సీట్ ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు జాబితా మరింత ఆలస్యం కాకుండా మరొ ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Recent Posts

Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం బంపర్ గుడ్ న్యూస్ యాభై శాతం డిస్కౌంట్..!

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…

1 hour ago

Amit Shah : మేము గెలిచిన మరుక్షణం వాళ్ళంతా జైల్లో.. అమిత్ షా..!

Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…

3 hours ago

Ration Card : రేషన్ లబ్ధిదారులకు షాక్‌ .. ఇలా చేయకుంటే మీ రేషన్ కార్డు రద్దు .. వెంటనే ఈ పని చేయండి ..!

Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…

4 hours ago

Pithapuram Varma : పవన్ కళ్యాణ్ కి నమ్మలేని షాక్ ఇస్తూ పిఠాపురం నడిబొడ్డు లో వర్మ అతిపెద్ద సంచలనం..!

Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…

6 hours ago

Abhishek Sharma : అభిషేక్ శర్మ బ్యాట్‌ తుఫాన్ .. పవర్ ప్లేలో కొత్త చరిత్ర.. కానీ 24 గంటల్లో మళ్ళీ సవాల్ ..!

Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…

7 hours ago

Power Bill : కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?.. అయితే వాట్సాప్‌లో క్షణాల్లోనే ఇలా కంప్లైంట్ చేయొచ్చు..!

Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…

9 hours ago

Watermelon : పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా ?.. అయితే మీ జీర్ణవ్యవస్థ ఖతమే.. !

Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…

11 hours ago

Sharbat : వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే ఈ అద్భుతమైన షర్బత్ .. ఆరోగ్య ప్రయోజ‌నాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!

Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…

13 hours ago

YS jagan : జగన్ ‘ప్లాన్ బి’ సిద్ధం.. ధర్మాన ఒత్తిడికి చెక్ పెట్టేలా శ్రీకాకుళంలో కొత్త నాయకత్వ సమీకరణాలు!

YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…

22 hours ago

IPAC : బొగ్గు కుంభకోణం లింకులు.. ఏపీ నిధుల మళ్ళింపు: ఐప్యాక్ చుట్టూ ఈడీ వల

IPAC  : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…

24 hours ago

Ys Jagan : జగన్ ‘మిషన్ 2029’: పాత ఆయుధాలతోనే కొత్త యుద్ధానికి సిద్ధమవుతున్న వైసీపీ బాస్..!

Ys Jagan :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…

1 day ago

Allu Arjun : రెమ్యునరేషన్ వద్దు.. లాభాల్లో వాటా ముద్దు : అల్లు అర్జున్ ‘ప్రాఫిట్ షేరింగ్’ మాస్టర్ ప్లాన్!

Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…

1 day ago