Roja : ఈసారి నగరి నుంచి కాదు.. ఎంపీ బరిలో రోజా..?
Roja : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమర శంఖం పూరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరు ఊహించని విధంగా అభ్యర్థుల ఎంపికలో జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 60 మంది అభ్యర్థుల స్థానాలను మార్చిన సీఎం జగన్…తుది జాబితా పై కూడా కసరత్తు మొదలుపెట్టారు. ఇక దీనిలో భాగంగానే ఎంపీల జాబితా ఎట్టకేలకు సిద్ధమైంది. అయితే ప్రస్తుతం మాజీమంత్రి రోజాపై నగరిలో సొంత పార్టీ వైసీపీ నుండి వ్యతిరేకత కనిపిస్తుంది. దీంతో నగరి నుండి రోజాను మార్చేసి పార్లమెంట్ బరిలో దించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తే అభ్యర్థులను ఎంపిక చేస్తున్న జగన్ ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సీటు లేకుండానే చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి బాలినేని ఇప్పటికీ మాగుంట సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.అదేవిధంగా జిల్లాలో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఒంగోలు పార్లమెంటు స్థానానికి ఒక దశలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వినిపించగా జిల్లా నేతల నుండి సానుకూలత కనిపించలేదు. దీంతో మరో అభ్యర్థి కోసం పార్టీ నేతలు అన్వేషించారు. ఈ నేపథ్యంలోనే నగరి నుంచి మంత్రి రోజా పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికే చెవిరెడ్డి కుమారుడు మోహిత్ కు చంద్రగిరి అసెంబ్లీ స్థానం కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో చెవిరెడ్డికి సీటు ఇస్తే ఒకే కుటుంబం నుండి రెండు సీట్లు ఆశిస్తున్న అభ్యర్థులు అభిప్రాయ వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పార్టీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజాను ఒంగోలు పార్లమెంట్ కు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజా అభ్యర్థిత్వంపై జిల్లా నేతలతో పార్టీ సమన్వయకర్త సాయి రెడ్డి చర్చించడం జరిగింది. ఇక జిల్లా నేతల నుండి సానుకూలత కనిపించడంతో రోజాను ఒంగోలు ఎంపీగా బరిలో దించేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బాలినేని , బూచేపల్లి వంటి నేతలు మరోసారి సీటు కేటాయింపు పై సీఎంతో మాట్లాడాలని భావిస్తున్నారు. ఇక ఈ విషయంపై ముందుగా సాయి రెడ్డితో చర్చించిన వేళ రోజా పేరు పరిశీలిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.రోజాతో కూడా ఇప్పటికే ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. ఇక ఈ విషయంపై మంత్రి రోజా జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారట. దీంతో నరసరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు ఒంగోలు నుండి మంత్రి రోజా ఖరారు పై సోమవారం సీఎం జగన్ తుది నిర్ణయం తెలియజేసే అవకాశం ఉంది.ఇక ఇదే సమయంలో రోజా ను నగరి నుంచి మార్చి అక్కడ సీట్ ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు జాబితా మరింత ఆలస్యం కాకుండా మరొ ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
This website uses cookies.