Vishakapatnam : విశాఖపై కర్చీఫ్ వేసిన బాలయ్య అల్లుడు.. గంటా పరిస్థితి ఏంటి..?

Authored By aruna | The Telugu News | Published on: February 20, 2024, 9:00 pm
  •  Vishakapatnam : విశాఖపై కర్చీఫ్ వేసిన బాలయ్య అల్లుడు .. గంటా పరిస్థితి ఏంటి..?

Vishakapatnam : టీడీపీ రాజకీయంలో భిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరికి ఎక్కడ టికెట్ దక్కుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక విశాఖపట్నంలో టీడీపీ పరిస్థితి చిత్రం గా సాగుతుంది. ఎవరికి ఎక్కడ టికెట్ దక్కుతుంది అన్నది తెలియడం లేదు. విశాఖ నుంచి ఎంపీగా 2024లో పోటీ చేయాలని బాలయ్య అల్లుడు శ్రీ భరత్ ఆశలు పెట్టుకున్నారు. అయితే బీజేపీతో పొత్తు గనుక ఉంటే విశాఖ లోక్ సభ సీటును ఆ పార్టీ వదులుకోవాల్సి ఉంటుంది. దాంతో బాలయ్య అల్లుడు విశాఖ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే సీట్ల కోసం వెతుకుతున్నారని ప్రచారం జరుగుతుంది. మొదట భీమిలి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాలని అనుకున్న అది పొత్తులో జనసేనకు పోతుంది. విశాఖ సౌత్ అనుకుంటే అక్కడ కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి పోటీగా ఉన్నారు .అటు ఇటు చూస్తే విశాఖ నార్త్ కనిపిస్తోంది.

విశాఖ నార్త్ నుంచి శ్రీ భరత్ పోటీకి రెడీ అవుతున్నారని అంటున్నారు. లోకేష్ శంఖారావం సభలో శ్రీ భరత్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ఉత్తర విశాఖ నుంచి పోటీ చేస్తారని అనుమానం కలుగుతుంది. ఉత్తర నియోజకవర్గం నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్టేజ్ పైన ఉండగానే శ్రీ భరత్ ఆయన గాలి తీసేసేలా మాట్లాడారు. గంటా అందుబాటులో లేకపోయినా తాను ఉత్తర నియోజకవర్గం ప్రజలకు పార్టీ జనాలకు అండగా ఉంటానని శ్రీ భరత్ వ్యాఖ్యానించారు. నారా లోకేష్ సమక్షంలో గంటాని అలా ఉత్తరానికి సంబంధం లేని నాయకుడిగా బాలయ్య అల్లుడు చేశారని అంటున్నారు. అయితే దానికి కూడా ఒక కారణం ఉంది.

నాలుగేళ్ల పాటు గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గం పట్టించుకోలేదు. ఆయన గెలిచినా కూడా సైలెంట్ గానే ఉండిపోయారు. ఎన్నికల ముందే యాక్టివ్ అవుతున్నారు. అయితే ఈసారి ఉత్తరం నుంచి పోటీ చేయరు వేరే నియోజకవర్గం చూసుకుంటున్నారు అని అంటున్నారు. నార్త్ లో టీడీపీని ఇన్నేళ్లుగా గాలికి వదిలేసారు అన్నది టీడీపీ హైకమాండ్ ఆలోచనగా ఉంది. నారా లోకేష్ ఆ మాట అనలేదు కానీ ఆయన ఎదుటనే తోడల్లుడు అన్నాడు. అంటే గంటా విషయంలో టీడీపీ అధిష్టానం వేరేగా ఆలోచిస్తుందని ఆలోచనలు కూడా కలుగుతున్నాయట. గంటా అయితే భీమిలి మీద ఆశలు పెట్టుకున్నారు తప్పితే చోడవరం అడుగుతున్నారు అని అంటున్నారు. అయితే గంటా విషయంలో చంద్రబాబు నాయుడు ఏమీ ఆలోచిస్తారో ఏం రకమైన నిర్ణయం తీసుకుంటారు తెలియడం లేదు. శ్రీ భరత్ మాత్రం ప్రజలకు అండగా ఉంటాను అని చెప్పి నార్త్ మీద కర్చీఫ్ వేశారని తెలుస్తుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp