Amaravathi : మళ్ళీ వార్తల్లోకి వచ్చిన అమరావతి – సుప్రీంలో ఊహించని సన్నివేశం..!

Advertisement
Advertisement

Amaravathi : ఇంకా సంవత్సరం కూడా లేదు. ఏపీలో ఎన్నికలు టైమ్ దగ్గరపడింది. అందుకే ఎన్నికల కసరత్తును పార్టీలన్నీ ప్రారంభించాయి. పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో వ్యూహాలను రచించడంలో బిజీ అయిపోయాయి. అయితే.. అధికార పార్టీ వైసీపీ కూడా ఎన్నికలకు సిద్ధం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి రెండోసారి ఏపీలో అధికారంలోకి రావాలని తెగ ఉబలాటపడుతోంది. అందుకే.. ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిందో.. అంతకంటే ఎక్కువ హామీలనే అమలు చేసింది. మూడు రాజధానులను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కానీ.. అది కాస్త సుప్రీంకోర్టులో కేసు అయి కూర్చొంది.

Advertisement

వైసీపీకి ఇప్పుడు ఏదైనా అసంతృప్తి ఉంది అంటే.. అది మూడు రాజధానుల సమస్య. ఎందుకంటే.. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు సూపర్ హిట్టు అయ్యాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఆ పథకాలను పొగిడాయి. కానీ.. మూడు రాజధానుల అంశం మాత్రం ఎటూ తేలకుండా పోయింది. సుప్రీంలో ఆ కేసు పెండింగ్ లో ఉంది. ఆ కేసు విచారణ ఇప్పుడు ఈ నెల 11న జరగనుంది. అయితే.. సుప్రీంకోర్టులో విచారణ తరువాత అంటే 12న ఏపీ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. దీంతో ఏపీలో ఉత్కంఠ నెలకొన్నది. సుప్రీంలో మూడు రాజధానులపై ఎలాంటి తీర్పు వస్తుందో అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.నిజానికి ఏపీ హైకోర్టులోనే మూడు రాజధానుల అంశం విచారణకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మూడు రాజధానుల అంశం తెరమీదికి రావడంతో అమరావతి రాజధాని మద్దతుదారులంతా మూడు రాజధానులకు వ్యతిరేకంగా కదం తొక్కారు. హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. దీంతో హైకోర్టు కూడా అమరావతిలోనే హైకోర్టు ఉండాలని తీర్పు చెప్పింది.

Advertisement

ap government again amaravathi land sale in bank

Amaravathi : హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్

దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తీర్పును రద్దు చేయాలంటూ కోరింది. దీనికి సంబంధించిన విచారణ ఈనెల 11న జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసును మే 17న వేరే ధర్మాసనం విచారించింది. కానీ.. విచారణ పూర్తిగా ముగియలేదు. దీంతో విచారణను జులై 11కు వాయిదా వేశారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మూడు రాజధానుల అంశం కూడా ఒక కొలిక్కి వస్తే వైసీపీ ప్రభుత్వానికి ఇక ఎలాంటి టెన్షన్ ఉండదు. వచ్చే ఎన్నికల్లో ప్రజలను ధైర్యంగా ఓట్లు అడగే చాన్స్ ఉంటుంది. అందుకే.. వైసీపీ ప్రభుత్వానికి ఈ విచారణ ఒక చాలెంజింగ్ గా మారింది.

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.