Amaravathi : మళ్ళీ వార్తల్లోకి వచ్చిన అమరావతి – సుప్రీంలో ఊహించని సన్నివేశం..!

Amaravathi : ఇంకా సంవత్సరం కూడా లేదు. ఏపీలో ఎన్నికలు టైమ్ దగ్గరపడింది. అందుకే ఎన్నికల కసరత్తును పార్టీలన్నీ ప్రారంభించాయి. పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో వ్యూహాలను రచించడంలో బిజీ అయిపోయాయి. అయితే.. అధికార పార్టీ వైసీపీ కూడా ఎన్నికలకు సిద్ధం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి రెండోసారి ఏపీలో అధికారంలోకి రావాలని తెగ ఉబలాటపడుతోంది. అందుకే.. ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిందో.. అంతకంటే ఎక్కువ హామీలనే అమలు చేసింది. మూడు రాజధానులను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కానీ.. అది కాస్త సుప్రీంకోర్టులో కేసు అయి కూర్చొంది.

వైసీపీకి ఇప్పుడు ఏదైనా అసంతృప్తి ఉంది అంటే.. అది మూడు రాజధానుల సమస్య. ఎందుకంటే.. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు సూపర్ హిట్టు అయ్యాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఆ పథకాలను పొగిడాయి. కానీ.. మూడు రాజధానుల అంశం మాత్రం ఎటూ తేలకుండా పోయింది. సుప్రీంలో ఆ కేసు పెండింగ్ లో ఉంది. ఆ కేసు విచారణ ఇప్పుడు ఈ నెల 11న జరగనుంది. అయితే.. సుప్రీంకోర్టులో విచారణ తరువాత అంటే 12న ఏపీ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. దీంతో ఏపీలో ఉత్కంఠ నెలకొన్నది. సుప్రీంలో మూడు రాజధానులపై ఎలాంటి తీర్పు వస్తుందో అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.నిజానికి ఏపీ హైకోర్టులోనే మూడు రాజధానుల అంశం విచారణకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మూడు రాజధానుల అంశం తెరమీదికి రావడంతో అమరావతి రాజధాని మద్దతుదారులంతా మూడు రాజధానులకు వ్యతిరేకంగా కదం తొక్కారు. హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. దీంతో హైకోర్టు కూడా అమరావతిలోనే హైకోర్టు ఉండాలని తీర్పు చెప్పింది.

ap government again amaravathi land sale in bank

Amaravathi : హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్

దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తీర్పును రద్దు చేయాలంటూ కోరింది. దీనికి సంబంధించిన విచారణ ఈనెల 11న జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసును మే 17న వేరే ధర్మాసనం విచారించింది. కానీ.. విచారణ పూర్తిగా ముగియలేదు. దీంతో విచారణను జులై 11కు వాయిదా వేశారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మూడు రాజధానుల అంశం కూడా ఒక కొలిక్కి వస్తే వైసీపీ ప్రభుత్వానికి ఇక ఎలాంటి టెన్షన్ ఉండదు. వచ్చే ఎన్నికల్లో ప్రజలను ధైర్యంగా ఓట్లు అడగే చాన్స్ ఉంటుంది. అందుకే.. వైసీపీ ప్రభుత్వానికి ఈ విచారణ ఒక చాలెంజింగ్ గా మారింది.

Recent Posts

Sand Mafia : కల్వచర్లలో మట్టి మాఫియా.. అర్థరాత్రి లారీలు, జేసీబీల‌ను అడ్డుకున్న స్థానిక ప్ర‌జ‌లు..!

Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…

6 hours ago

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!

Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…

8 hours ago

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

10 hours ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

11 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

12 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

13 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

14 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

16 hours ago