
YS Jagan : వైఎస్ జగన్పై ఉత్తరాంధ్ర నేతల ఆగ్రహం.. ప్రాంతీయ సమన్వయకర్తలను మళ్లీ తీసుకురానున్న జగన్ ?
YCP : ఐదు సంవత్సరాల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తన హవా చూపిస్తూ దూసుకుపోయాడు. ఇప్పుడు జగన్కు కష్టాలు రెట్టింపు అయ్యాయా? అన్నీ ఒక్కసారే వచ్చిపడ్డాయా? వాటిని ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతున్నారా? అని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది.వైసీపీ అధినేత, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు పార్టీ నుంచి నమ్ముకున్న నేతలు బయటకు వెళ్లిపోవడం, మరోవైపు ఫ్యామిలీ కష్టాలు, లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం జగన్ని టార్గెట్ చేయడం జగన్కి మింగుడుపడడం లేదు. వచ్చే ఐదేళ్లు కూడా.. పార్టీకి, పార్టీ అధినేత జగన్కు కూడా ఆటు పోట్లు తప్పేలా లేవని తెలుస్తోంది.
తనపై నమోదైన అక్రమ కేసుల నుంచి జగన్ తప్పించుకునే పరిస్థితి లేదు. మామూలుగా ఓటు బ్యాంకు రాజకీయాలపై లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం జగన్ కు, ఆయన పార్టీకీ తీరని నష్టం చేసిందని అంతా భావిస్తున్నారు కానీ, లడ్డూ ప్రసాదంలో కల్తీ ఎఫెక్ట్ అంత కంటే లోతుగానే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ మీడియా ముందుకు వచ్చి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో చేసిన రాజకీయ విమర్శలు పూర్తిగా నిరుపయోగం అవ్వడమే కాకుండా.. కచ్చితంగా జగన్ హయాంలోనే ఈ కల్తీ జరిగిందన్నది ప్రజలకు నిర్ధారణ చేశాయి. ఇది వైసీపీకి రాజకీయంగా తీరని నష్టం కలిగించిందనడంలో సందేహం లేదు. కేవలం నష్టమే కాకుండా ఆ పార్టీకి రాజకీయ ఉనికిని కూడా ప్రశ్నార్థకం చేసే రేంజ్ లో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ప్రజలలో ఆగ్రహావేశాలను నింపింది.
YCP : దారుణమైన పరిస్థితిలో జగన్.. వైసీపీకి దిక్కెవరు ?
అయితే సాక్ష్యాలు చూపాలని జగన్ అంటుండగా, కూటమి ప్రభుత్వం ల్యాబ్ పత్రాలు చూపిస్తూ ఇంకేం ఆధారాలు కావాలని అంటుంది. మరోవైపు అత్యున్నత సిట్ బృందాన్ని కూడా నియమించింది. ఇప్పటికే ఆ బృందం విచారణ కూడా జరిపిస్తుంది. అయిన జగన్ మాత్రం పలువురికి లేఖలు రాసుకుంటూ పోతున్నాడు.లడ్డూ వివాదం తరువాత వైసీపీ పార్టీకి బీజేపీ అవకాశం ఇవ్వడం లేద. తన రాజకీయ ప్రయోజనాల కోసమైనా.. జగన్ కు మద్దతు, సహకారం అందించే పరిస్థితి ఇప్పుడే కాదు మరెప్పుడూ తలెత్తే అవకాశం లేదు. హిందూత్వను భుజాన వేసుకునే బీజేపీ ఇప్పుడు అనివార్యంగా మిగిలిన అన్ని పార్టీల కంటే ఎక్కువగా జగన్ పై విమర్శలు గుప్పించి, జగన్ తిరుమల తిరుపతికి చేసిన అపచారాన్ని ఎండగట్టక తప్పని పరిస్థితి లడ్డూ వివాదం కారణంగా ఏర్పడింది.
Vijaya Milk : తెలుగు రాష్ట్రాల్లో విజయ డైరీ పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా పాడి రైతులకు అండగా…
YS Jagan : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో నమ్మకానికి మారుపేరుగా ఉన్న విజయ డైరీ ఉత్పత్తుల విషయంలో ఇప్పుడు కొత్త…
Tirumala : తిరుమల శ్రీవారి కి భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకునే కానుకల విషయంలో ఒక సంచలనమైన దొంగతనం వెలుగులోకి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. ఎన్నికల తర్వాత కొంచెం సైలెంట్ గా ఉన్న…
TKGKS - KANA - Khammam : ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ…
Revanth Reddy : హైదరాబాద్ నగరం మరో అద్భుతమైన వినోద కేంద్రానికి వేదిక కాబోతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…
Sardar Papanna statue : తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప వీరుల్లో సర్దార్ సర్వాయి పాపన్న…
IPL 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన…
HPCL Recruitment 2026 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ…
Central Govt : దేశంలో డీజిల్, వంటగ్యాస్ వంటి ఇంధనాల కృతిమ కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
PM Shram Yogi Mandhan Yojana : దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై యాంకర్గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించిన రష్మి గౌతమ్ మరోసారి సోషల్ మీడియాలో…
This website uses cookies.