Undavalli Arun kumar : ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ .. సీఎం ఎవరో క్లారిటీ ఇచ్చేసారు..?

Advertisement
Advertisement

Undavalli Arun kumar  : ఏపీ రాజకీయాలపై మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తీరుపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు నాయుడు భయపడ్డారని, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా భయపడ్డారని అన్నారు.ఎందుకంటే కేసులు భయంతోనే వాళ్ళు వెనుకంజ వేశారని విమర్శించారు. రాక్షసుని, దుర్మార్గున్ని అయిన భరించవచ్చు కానీ పిరికివాడిని భరించే పరిస్థితి ఉండకూడదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఎన్నికల సమయంలో నోటాకు ఓట్లు పడకపోవడానికి కారణాలు ఉన్నాయి. ప్రజలు ఎవరు తక్కువ అవినీతిపరుడు చూసుకొని వారికి ఓటేస్తున్నారు తప్ప నోట జోలికి వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు.

Advertisement

మార్కెట్లో టమాటాలన్నీ పుచ్చులే ఉన్నప్పుడు వాటిలో కాస్త తక్కువ పుచ్చులు ఉన్న వాటిని ఏరుకుంటాం. ఇది అంతేనని ఆయన అన్నారు. ఎన్నికలు మానేయమంటే ప్రజలు మానేస్తారా టమాటాల విషయంలోనే కాదు ఇది అన్నింటికీ వర్తిస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్రాన్ని అడగటానికి భయపడి చంద్రబాబు నాయుడు తన మీద ఉన్న కేసులతో ఐదేళ్లు అడగడానికి భయపడ్డారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి కాబట్టి అడగడానికి భయపడుతున్నారని అన్నారు. కేసులు లేకుండా ఎవరున్నారు అని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రపంచంలో కెల్లా నేనే నిజాయితీపరున్ని అని చెప్పే కేజ్రివాల్ పై కూడా కేసు పెట్టారు. ఢిల్లీలో ప్రైవేట్ స్కూల్లో ఎవరు చేరకుండా అందరూ ప్రభుత్వ స్కూల్లోనే చేరే పరిస్థితి తెచ్చిన సిసోడియాను కూడా జైల్లో వేశారు.

Advertisement

సిసోడియా జైలుకెళ్ళి సంవత్సరం అవుతుంది. అతన్ని బయటకి రానివ్వరు ఇలా అందరినీ ఏరుతారు. దీనివల్ల నష్టం ఏంటి అని ప్రశ్నించారు. జైలుకెళితే ఓడిపోతాను అనడం అర్ధరహితం. జైలుకెళ్ళిన ప్రతివాడు గెలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్లేసి ముఖ్యమంత్రిగా గెలిచాడు. ఇక చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల జైలుకి వెళ్ళాడు ఆయన కూడా సీఎం అవుతాడు అని ఉండవల్లి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. పార్లమెంట్ తలుపులు మూసి ఎంతో రగడ చేసి రాష్ట్ర విభజన చట్టం తయారు చేశారు. ఆ చట్టాన్ని అమలు చేయడానికి తిరగబడమని అంటున్నాం అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

Recent Posts

Winter Season : చలికాలంలో ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతి ఎందుకు?.. శరీరం చెప్పే సైన్స్ ఇదేనా?

Winter Season : చలికాలం మొదలైతే మన చుట్టూ ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. కొందరు మంచు గాలులు వీచినా…

24 minutes ago

Mouni Amavasya : మౌని అమావాస్య ప్రాముఖ్యత : ఈ పవిత్ర రోజున పాటించాల్సిన నియమాలు, చేయవలసిన పూజలు..!

Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…

1 hour ago

Zodiac Signs January 18 2026 : జ‌న‌వ‌రి 18 ఆదివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…

2 hours ago

Kavitha : సిద్దిపేట ఎమ్మెల్యేగా క‌విత‌… ఏం జ‌రుగుతుంది..?

Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…

11 hours ago

Mana Shankara Vara Prasad Garu Movie : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’.. 5 రోజుల్లో రూ.226 కోట్ల గ్రాస్

Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…

12 hours ago

Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీలో కోట్ల మౌనం.. పార్టీపై అసంతృప్తితో ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ?

Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…

13 hours ago

Smart TV : రూ.7,499కే 32 అంగుళాల స్మార్ట్ టీవీ..! తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్లు – నెటిజన్లను ఆకట్టుకుంటున్న డీల్

Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…

15 hours ago

Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో రాజకీయ వేడి .. జేసీ పాలనపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్

Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…

16 hours ago