Kodali Nani : గన్నవరం నుంచి పోటీపై క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని ..!

Advertisement
Advertisement

Kodali Nani : ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక వైసీపీ పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలలో టెన్షన్ పెరుగుతుంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్లకు వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారు. కీలక నేతలకు కూడా సీట్లు దక్కకపోవచ్చు అని ప్రచారం సాగుతుంది. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన కొడాలి నాని పేరు తెరపైకి వచ్చింది. ఈసారి గుడివాడ టికెట్ ను నానికి ఇవ్వడం లేదని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. ఆయన స్థానంలో వైసీపీ సీనియర్ నేత మండవ హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

Advertisement

ఈ నేపథ్యంలో కొడాలి నాని స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో ఎవరు పోటీ చేయాలనేది తమ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెబుతారని, మధ్యలో ఉన్న పకోడీగాళ్లకు ఏం సంబంధం అని మండిపడ్డారు. వినేవాడు తెలుగు తమ్ముళ్లయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కూడా వైయస్ జగన్ సీటు ఇచ్చారని చెప్పారు. వైరవీలు చేస్తేనో, బ్రోకర్ పనులు చేస్తేనో, డబ్బుందనో, ఎవరో చెప్పారనో వైసీపీలో టికెట్లు ఇవ్వాలని అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. గుడివాడలో హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారు అంటూ వెలసిన ఫ్లెక్సీల పై కొడాలి నాని స్పందిస్తూ ఎవడో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయాన్నే తీసేసాడని అన్నారు. దమ్ముంటే తనను ఓడించడానికి చంద్రబాబు నాయుడు గుడివాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

Advertisement

వైయస్ జగన్ శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే తనకు వల్లభనేని వంశీకి సీట్లు లేవంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గుడివాడ నుంచి తాను గన్నవరం నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తామని కొడాలి నాని చెప్పారు. నాపై చేస్తున్న అసత్య ప్రచారానికి చంద్రబాబుకి సవాల్ విసిరుతున్న దమ్ముంటే నాతో గుడివాడలో పోటీ చేయండి అని అన్నారు. అదెలాగో చేతకాదు. ఎల్లో మీడియా అధినేతలందరూ అనుకుంటే నా సీటు పోతుందా. జీవితాంతం మాజీగా ఉండే చంద్రబాబునాయుడు ఎక్స్ నుండి ఛాలెంజ్ లు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతమే కాదు పర్మనెంట్ ముఖ్యమంత్రిగా ఉంటారు. చంద్రబాబు నాయుడు సీఎం వైఎస్ జగన్ ను కాకుండా తనలా మాజీలుగా ఉండే వాళ్లపై సోషల్ మీడియాలో ఛాలెంజ్ లో చేసుకోవాలి అని కొడాలి నాని అన్నారు.

Recent Posts

Today Gold Rate 18 January 2026 : బంగారం ధరలకు బ్రేక్‌..ఆదివారం కొనుగోలుదారులకు కాస్త ఊరట

Today Gold Rate 18 January 2026 : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ రావడం…

7 minutes ago

Ram Charan : తారక్ మ్యాడ్ డ్రైవర్..! జూనియర్ ఎన్టీఆర్ డ్రైవింగ్ స్కిల్స్‌పై రామ్ చరణ్ కామెంట్స్ వైరల్

Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి సోషల్…

58 minutes ago

Winter Season : చలికాలంలో ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతి ఎందుకు?.. శరీరం చెప్పే సైన్స్ ఇదేనా?

Winter Season : చలికాలం మొదలైతే మన చుట్టూ ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. కొందరు మంచు గాలులు వీచినా…

2 hours ago

Mouni Amavasya : మౌని అమావాస్య ప్రాముఖ్యత : ఈ పవిత్ర రోజున పాటించాల్సిన నియమాలు, చేయవలసిన పూజలు..!

Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…

3 hours ago

Zodiac Signs January 18 2026 : జ‌న‌వ‌రి 18 ఆదివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…

4 hours ago

Kavitha : సిద్దిపేట ఎమ్మెల్యేగా క‌విత‌… ఏం జ‌రుగుతుంది..?

Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…

12 hours ago

Mana Shankara Vara Prasad Garu Movie : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’.. 5 రోజుల్లో రూ.226 కోట్ల గ్రాస్

Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…

13 hours ago

Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీలో కోట్ల మౌనం.. పార్టీపై అసంతృప్తితో ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ?

Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…

15 hours ago