Categories: andhra pradeshNews

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ‘‘జగన్ లో మనిషి లక్షణాలే లేవు’’ అంటూ ఆమె ధ్వజమెత్తారు. ‘‘నీ కారు టైర్ కింద నీ పార్టీ కార్యకర్తే పడిపోతే కూడా, కారును ఆపకుండా ముందుకు వెళ్లిపోయావ్ ఇదేనా నీ మానవత్వం’’ అని ప్రశ్నించారు. ఇటువంటి అమానవీయ చర్యలు ప్రజల మన్నన పొందే నాయకునికి తగవని ఆమె అన్నారు.జగన్‌‌మోహన్‌రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మృతి చెందిన సింగయ్యకు సంబంధించి సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సింగయ్య తొలుత జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని మృతి చెందాడని భావించారు. అయితే, జగన్ కారే స్వయంగా సింగయ్య మెడపై నుంచి వెళ్లిన వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? ఉంటె ఆలా వెళ్లిపోవు – అనిత

సింగయ్యను ఢీకొట్టింది సాక్షాత్తూ జగన్ ప్రయాణించిన వాహనమేనని వార్తలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.ఈ క్రమంలో పోలీసులకు కీలకమైన వీడియో ఆధారం లభించింది. జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద ఓ వ్యక్తి పడి నలిగిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియోలో జగన్ కారు పైనుంచి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా, అదే సమయంలో ఓ కార్యకర్త (సింగయ్య) కారు టైర్ల కింద పడి నలిగిపోవడం స్పష్టంగా రికార్డయింది. మరో వీడియోలో, కారు కింద వృద్ధుడు పడినట్టు స్థానికులు కేకలు వేస్తున్నా, వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చినట్టు కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన పై వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ‘‘కారు పక్కకు ఆపి సింగయ్యను ఆసుపత్రికి తీసుకెళ్తే బతికి ఉండేవాడు’’ అని వ్యాఖ్యానించారు. ఇది ఎంతటి బాధాకరమైన ఉదంతమో చెప్పలేనిదని ఆమె అన్నారు. ఓ నేతగా తన కార్యకర్తలకు బాధ్యత తీసుకోవాల్సిన సమయాల్లో జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని విమర్శించారు. ‘‘ఒక కార్యకర్త ప్రాణాలు కోల్పోయినా బాధపడని నేత, ఆ కుటుంబానికి ఓదార్పు చెప్పలేని నాయకుడు ఇక ఏంచేస్తాడు?’’ అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రజలు ఇలాంటి వ్యవహారాలను గమనిస్తున్నారని, ఇక ముందు నాయకత్వంలో మానవత్వం, బాధ్యత ముఖ్యమని ప్రజలు నిర్ణయించుకుంటారని హోం మంత్రి అభిప్రాయపడ్డారు. జగన్ లాంటి నేతలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారని ఆమె హెచ్చరించారు.

Recent Posts

Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల త‌ర్వాత‌ చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో…

20 minutes ago

Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

Actress  : ఒకనాటి బాలీవుడ్‌ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం సినిమాల‌కి కాస్త దూరంగానే…

38 minutes ago

Warangal Congress : వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతుంది.. కొండా దంపతులు vs ఐదుగురు ఎమ్మెల్యేలు

Warangal Congress : కాంగ్రెస్‌ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్‌…

3 hours ago

RK Roja : గబ్బర్ సింగ్ ఇప్పుడు రబ్బర్ సింగ్ అయ్యాడు.. పవన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో

RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…

4 hours ago

Telangana : నిజంగా గ్రేట్.. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఫుల్.. అడ్మిషన్స్ లేవు బోర్డు..!

Telangana  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…

5 hours ago

Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పెళ్లైన‌ వారంలో 2000 సార్లు ప్రియుడికి ఫోన్‌.. పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు..!

Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…

6 hours ago

Ration Cards : వారందరికీ రేషన్ కార్డ్స్ కట్… కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం

Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…

7 hours ago

Guntur Sp : సింగ‌య్య మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు ఎస్పీ.. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ ఇస్తాను..!

Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి…

8 hours ago