Venu Swamy : జగన్ పై ఎప్పుడు అరిచిన వాళ్లే మరో ఆరు నెలల్లో ఆయన కాళ్లు పట్టుకుంటారు .. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Venu Swamy : జగన్ పై ఎప్పుడు అరిచిన వాళ్లే మరో ఆరు నెలల్లో ఆయన కాళ్లు పట్టుకుంటారు .. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..

Venu swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలు చెప్పిన వేణు స్వామి తాజాగా ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జాతకం గురించి తెలిపారు. 2024లో, 2029 లో మళ్లీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తారని ఆయనను విమర్శించినన్నినాళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. 2024 లో కేసీఆర్ లాగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి మారబోతున్నారని […]

 Authored By aruna | The Telugu News | Updated on :23 January 2024,1:21 pm

Venu swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలు చెప్పిన వేణు స్వామి తాజాగా ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జాతకం గురించి తెలిపారు. 2024లో, 2029 లో మళ్లీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తారని ఆయనను విమర్శించినన్నినాళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. 2024 లో కేసీఆర్ లాగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి మారబోతున్నారని వేణు స్వామి అన్నారు. ఇక షర్మిల జాతకరీత్యా తన అన్నకు వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నారని అన్నారు.

ఏపీలో తన అన్న వెంట షర్మిల ఉంటే ఎంపీ సీటు వచ్చేది, రాజయోగం పట్టేది. కానీ ఆమె అందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. ఆమె సొంతంగా పార్టీ పెట్టడం వలన తెలంగాణలో ఎటువంటి ఉపయోగం కలగలేదు. ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటినుంచి ఆమె ప్రభావం ఎంత మాత్రం ఉండదని అన్నారు. ఇప్పుడు కూడా వై.యస్.షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినంత మాత్రాన ఆమె ప్రభావం ఏమాత్రం ఉండదని అన్నారు. సీఎం చెల్లిగా ఆమె కష్టాలు పడాల్సిన అవసరం లేదని లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఆమె తీసుకుంటున్న నిర్ణయాల వలన ఆమె చాలా కష్టపడుతున్నారు కానీ ఫలితం దక్కదు అని వేణు స్వామి అన్నారు.

ఇక వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఏపీలో మూడు సార్లు సీఎం గా పదవి చేపడతారని, 2024, 2029 ఎన్నికల్లో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. టీడీపీ పార్టీకి అంతగా ప్రాముఖ్యత ఉండదని అన్నారు. జగన్ ను విమర్శించిన వాళ్లు ఆయనే సీఎం గా ఉంటారని అన్నారు. 2024లో కేసీఆర్ లాగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి మారబోతున్నారని స్వామి అన్నారు. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కి ముఖ్యమంత్రి యోగం లేదని, ఎమ్మెల్యేగా గెలుస్తారని వేణుస్వామి అన్నారు. దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల వేణు స్వామి చెబుతున్న జాతకాలు బెడిసి కొడుతున్నాయి. ప్రభాస్ కెరియర్ డౌన్ అవుతుందని, తెలంగాణలో మళ్లీ కేసిఆర్ వస్తారని చెప్పారు. కానీ ప్రభాస్ సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. అయినా కూడా వేణు స్వామి వాటన్నింటినీ కవర్ చేస్తూ మళ్ళీ జాతకాలు చెబుతూనే ఉన్నారు

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది