Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఆయన కూడా ఒక సెలబ్రిటీగా మారారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీ జాతకాలు చెప్పినా ఆయన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. వేణు స్వామి చెప్పిన వాటిలో కొన్ని నిజమయ్యాయి. మరికొన్ని జరగలేదు. అయితే ఆయన చెప్పిన వాటిల్లో కొన్ని నిజం అవటం వలన ఆయన చెప్పేవి నిజమే అని కొందరు నమ్ముతున్నారు. ఇక తాజాగా అయినా ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024, 2029 ఎన్నికల్లో మళ్ళీ సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని, 2024 ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు.
ఇక చంద్రబాబు నాయుడు మరియు ఆయన తెలుగుదేశం పార్టీ అంతరించిపోతాయని ఈ సందర్భంగా వేణు స్వామి తెలిపారు. 2024 లో కేసీఆర్ లా వైఎస్ జగన్ మారబోతున్నారని, ఆయన అందరిని కంట్రోల్ చేస్తారని, మళ్లీ సీఎం గా గెలుస్తారని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని స్థాపించి ఇక్కడ రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల రాజకీయంగా పెద్దగా ఎదగలేరని చెప్పారు. వైయస్ షర్మిల తన అన్న వైఎస్ జగన్ తో ఉంటే ఆమె జీవితం బాగుంటుంది అని ఈ సందర్భంగా వేణు స్వామి తెలియజేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ మరియు కేసీఆర్ కొడుకు రాజకీయంగా అభివృద్ధి చెంది అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని వేణు స్వామిని అడిగినప్పుడు వారిద్దరి జాతకాల ప్రకారం అలాంటిది జరిగే అవకాశం తక్కువ అని చెప్పారు.
ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా కేటీఆర్ గెలిచినప్పటికీ ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని చెప్పారు. ఇక నారా లోకేష్ విషయానికి వస్తే ఆయన 2024లో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉండవచ్చు కానీ ముఖ్యమంత్రి అయ్యేవరకు వెళ్లే అవకాశాలు లేవని వేణు స్వామి తెలియజేశారు. దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని అంటున్నారు. ఏపీలో వైయస్ జగన్ ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఒకవైపు వైఎస్ జగన్ ఒకవైపు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుస్తారు మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.