YS Jagan : అదేంటి.. మూడు రాజధానులంటేనే ఏపీ ప్రజలు భగ్గుమంటున్నారు. అమరావతి ఉద్యమం తారాస్థాయిలో ఉంది. ఈ సమయంలో మరో రాజధానిని సీఎం జగన్ ప్రకటించారా? అసలు ఎప్పుడు ఇదంతా జరిగింది అంటారా? ఆయన అఫిషియల్ గా నాలుగో రాజధానిని ప్రకటించలేదు కానీ.. వెటర్నరీ, బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ను పులివెందులకు తరలించి.. ఏపీకి నాలుగో రాజధానిని ప్రకటించినంత పని చేశారు అని అంటున్నారు రాజకీయ వేత్తలు.
ఎందుకంటే.. ఇప్పటికే అమరావతి నుంచి ఒక్కో కార్యాలయం విశాఖకు తరలిపోతోంది. ఓవైపు ఇంకా రాజధానుల అంశం కోర్టులో నానుతున్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు ప్రభుత్వ ఆఫీసులను తరలిస్తోంది. ఇప్పటికే మెట్రో కార్యాలయం కూడా విశాఖకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది.
తాజాగా.. కడప జిల్లా పులివెందులకు వెటర్నరీ, బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అసలు.. పులివెందులకు ఆ ఇన్ స్టిట్యూట్ ను తరలించడానికి కారణం.. పులివెందుల.. సీఎం జగన్ సొంత నియోజకవర్గం. నిజానికి.. ఈ ఇన్ స్టిట్యూట్ ను కంకిపాడులో ఏర్పాటు చేసేందుకు గత సంవత్సరం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పశుసంవర్థక మంత్రి ఈ కార్యాలయాన్ని కంకిపాడులో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అన్నీ ఏర్పాటు కూడా చకచకా జరిగిపోయాక… చివరి నిమిషంలో ఆ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు ఆగిపోయింది.
కట్ చేస్తే.. ప్రస్తుతం కంకిపాడు కాదని… ఇన్ స్టిట్యూట్ ను పులివెందులకు తరలిస్తున్నారు. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ చెప్పినట్టుగానే.. పులివెందులకు ఈ ఇన్ స్టిట్యూట్ ను తరలిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ఈ ఒక్క ఇన్ స్టిట్యూట్ పులివెందులకు తరలిస్తే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ.. త్వరలోనే మరికొన్ని సంస్థలను కూడా పులివెందులకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. విశాఖకు సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తే ఓకే కానీ.. పులివెందులకు ఎందుకు తరలిస్తున్నట్టు.. అంటూ ఏపీ ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
సీఎం జగన్.. ఇన్ డైరెక్ట్ గా ఏపీకి నాలుగో రాజధాని పులివెందులను ప్రకటించారని.. పులివెందులను కూడా ఏపీ రాజధానిగా భావించి.. కార్యాలయాలను తరలిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అయినప్పటికీ.. అది మొదటిదని.. రెండో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పులివెందుల అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా.. పులివెందులను ఏపీ క్యాపిటల్ గా ఏపీ ప్రజలు స్వీకరిస్తారా? లేదా? అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.