Vidadala Rajini : కంట్లో నీళ్ళతో .. చిలకలూరిపేటకి రజిని గుడ్ బై ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vidadala Rajini : కంట్లో నీళ్ళతో .. చిలకలూరిపేటకి రజిని గుడ్ బై ?

 Authored By siddhu | The Telugu News | Updated on :19 February 2026,6:04 pm

ప్రధానాంశాలు:

  •  Vidadala Rajini : కంట్లో నీళ్ళతో .. చిలకలూరిపేటకి విడదల రజిని గుడ్ బై ?

Vidadala Rajini : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మాజీ మంత్రి విడదల రజిని పేరు మారుమోగిపోతోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 18న అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత, వైసీపీ శ్రేణుల్లో ఒకవైపు ఉత్సాహం కనిపిస్తున్నా, మరోవైపు రజిని రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమెకు ఎదురవుతున్న పరిణామాలు చూస్తుంటే, రజిని అక్కడి నుంచి తప్పుకోబోతున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ చంద్రబాబు నాయుడు, లోకేష్ ‘రెడ్ బుక్’ గురించి చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించడం రజిని వర్గంలో గుబులు రేపుతోంది.

Vidadala Rajini కంట్లో నీళ్ళతో చిలకలూరిపేటకి విడదల రజిని గుడ్ బై

Vidadala Rajini : కంట్లో నీళ్ళతో .. చిలకలూరిపేటకి విడదల రజిని గుడ్ బై ?

చిలకలూరిపేటలో రజిని పీఏ మరియు అనుచరులపై పాత కేసులు రీ-ఓపెన్ అవ్వడం, ఐటీడీపీ నేతలు ఆమెపై వరుస ఫిర్యాదులు చేయడం వెనుక పెద్ద రాజకీయ స్కెచ్ ఉన్నట్లు కనిపిస్తోంది. అంబటి రాంబాబు జైలుకు వెళ్ళిన సమయంలో రజిని స్వయంగా రాజమండ్రి వెళ్ళి పరామర్శించినప్పటికీ, ఆమెపై కూడా పీటీ వారెంట్లు జారీ అయ్యే అవకాశం ఉందన్న గాసిప్స్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ తన తాజా సర్వే నివేదికల ఆధారంగా రజినిని చిలకలూరిపేట నుంచి మార్చి, మరేదైనా ‘సేఫ్ జోన్’ నియోజకవర్గానికి పంపే ఆలోచనలో ఉన్నారని, అందుకే ఆమె తన సొంత నియోజకవర్గానికి దాదాపు గుడ్ బై చెప్పేసినట్లేనని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, రజిని మాత్రం తానేమీ తప్పు చేయలేదని, ‘రెడ్ బుక్’ పేరుతో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధీటుగా బదులిస్తున్నారు. కానీ, అంబటి రాంబాబు విడుదల తర్వాత ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు, లోకేష్ డైరెక్ట్ వార్నింగ్‌లు రజినిని ఇరకాటంలో పడేశాయి. నగరిలో రోజా సైలెంట్ అవ్వడం, అటు వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై కూడా బాబు సీరియస్ అవ్వడం చూస్తుంటే.. వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలందరినీ ఒక ప్లాన్ ప్రకారం ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని అర్థమవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చిలకలూరిపేట గడ్డపై రజిని మళ్ళీ పాగా వేస్తారా లేక ఈ ఒత్తిడికి తలొగ్గి నియోజకవర్గాన్ని మార్చేస్తారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది…

siddhu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది