Y.S.Sharmila VS Kodali Nani : ఏపీలో ఎన్నికల వాతావరణం వాడీ వేడిగా కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒక విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక తాజాగా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వై.యస్.షర్మిల కాంగ్రెస్ చేరికపై కామెంట్స్ చేశారు. ఇక వైయస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే ఆమె మొదటి స్పీచ్ లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే టీడీపీ ప్రభుత్వం పై కూడా ఆమె మండిపడ్డారు. వై.యస్.షర్మిల మాట్లాడుతూ జగన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేశారు.
నిరాహార దీక్షలు కూడా చేశారని, ప్రతిపక్షంలో ఉండగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, తెలుగుదేశం పార్టీలో ఎంపీలు మద్దతు ఇవ్వాలని అన్నారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదాను ఎందుకు తీసుకురాలేదని వై.ఎస్.షర్మిల ప్రశ్నించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదని అన్నారు. వైసీపీ స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడానికి గల శాపం వైసీపీ టీడీపీ దే అని అన్నారు. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అన్నారు. ఇక కొడాలి నాని మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ కి ఒకటి శాతం ఓటింగ్ మాత్రమే ఉందని అన్నారు.
గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై వై.యస్.జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచారని అన్నారు. అంత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీపై వై.యస్.జగన్మోహన్ రెడ్డి గెలిచారు ఇప్పుడు ఒకటి శాతం ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ పై జగన్మోహన్ రెడ్డి సులువుగా గెలుస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడు కి డిపాజిట్లు కూడా రావని అన్నారు. గత ఎన్నికల్లో జనసేన రెండో స్థానంలో, టీడీపీ మూడో స్థానంలో ఉండి డిపాజిట్లు కూడా దక్కించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒకటి శాతం ఓటింగ్ మాత్రమే ఉందని, వై.యస్.షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమీ ఉండదని అన్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.