MLA Parthasarathy : పార్టీ బుజ్జగిస్తున్న మెత్తబడని ఎమ్మెల్యే పార్థసారథి..!

Advertisement
Advertisement

MLA Parthasarathy : మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. పెనమలూరు ఎమ్మెల్యే సీటు కాదని పార్థసారధికి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని వైసీపీ హై కమాండ్ చెప్పడంతో రచ్చరచ్చగా మారింది. ఎంపీగా పోటీ చేసే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే గానే పోటీ చేస్తానని, అది కూడా పెనమలూరు నుంచి పోటీ చేస్తానని పార్థసారథి తేల్చి చెప్పేసారు. దీంతో రెండు రోజులుగా పార్థసారధిని వైసీపీ హై కమాండ్ బుజ్జగించే పనిలో పడింది. మంగళవారం నాడు ఎంపీ సీటుకు సంబంధించి పార్థసారథి తో ప్రాంతీయ సమన్వయకర్త అయోధ్య రామిరెడ్డి భేటీ అయ్యారు. మచిలీపట్నం ఎంపీ గానే పోటీ చేయాలంటూ పార్థసారధికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

అయితే అందుకు ఎమ్మెల్యే పార్థసారథి అంగీకరించేందుకు ససేమీరా అంటున్నట్లు తెలుస్తోంది. పార్థసారథి కార్యాలయానికి అయోధ్య రామిరెడ్డి రాగా దాదాపుగా అరగంట పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. అయినప్పటికీ క్లారిటీ రాని పరిస్థితి. దీంతో పార్థసారథి కార్యాలయం నుంచి కొద్దిసేపటి క్రితం అయోధ్య రామిరెడ్డి వెళ్ళిపోయారు. సోమవారం జరిగిన చర్చల పట్ల పార్థసారథి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ అయోధ్య రామిరెడ్డి బుజ్జగించినప్పటికీ పార్థసారధి మెత్తబడని పరిస్థితి. సీనియర్ ఎమ్మెల్యే అయిన తన పట్ల వైసీపీ అధిష్టానం వ్యవహరించిన తీరుపై పార్థసారథి ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో పార్థసారథి టీడీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

Advertisement

యాదవ సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథి ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి కూడా చేశారు. అయితే రానున్న శాసనసభ ఎన్నికలకు వైయస్సార్ సీపి పార్టీని మళ్లీ గెలిపించాలని సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి మంత్రులను, ఎమ్మెల్యేలను తొలగిస్తూ, ట్రాన్స్ ఫర్ చేస్తూ కీలక మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారధికి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పగా, అందుకు పార్థసారథి ఒప్పుకోలేదు. ఎంపీ సీటు వద్దని ఎమ్మెల్యే సీటు కావాలని, అది కూడా పెనమలూరు నుంచి కావాలని పార్థసారథి పట్టుపట్టారు. ఇక ఆయనను బుజ్జగించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా ఆయన తగ్గడం లేదు. దీంతో ఆయన టీడీపీలోకి చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

2 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

3 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

4 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

5 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

6 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

7 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

8 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

9 hours ago

This website uses cookies.