
youth died of heart Stroke while watching india vs australia match
India VS Australia : నిన్న జరిగిన భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ దారుణంగా ఓడిపోయింది. ఆ మ్యాచ్ ఓటమిని టీమిండియా కూడా తీసుకోలేకపోయింది. భారతదేశంలోని 140 కోట్ల మంది భారతీయులు కూడా భారత్ ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయారు. ఆస్ట్రేలియా గెలుపు ఖాయం కాగానే.. ఒక్క మోదీ స్టేడియం మాత్రమే కాదు.. యావత్ భారత్ మొత్తం మూగబోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ సాధించిన ఆనందంలో సంబురాలు చేసుకుంటూ ఉంటే.. భారత్ మాత్రం సైలెంట్ అయిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర ప్లేయర్స్ అందరూ వరల్డ్ కప్ చేజారడంతో వెక్కి వెక్కి ఏడ్చారు. చాలా మంది క్రికెట్ అభిమానులు కూడా డిసప్పాయింట్ అయ్యారు. అదే వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తూ భారత్ ఇక ఓడిపోతుందని తెలిసి ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు.
భారత్ ఓటమిని జీర్ణించుకోలేక గుండెపోటుతో జ్యోతి కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. తిరుపతికి చెందిన ఈ యువకుడు.. నిన్న ఫైనల్ మ్యాచ్ ను చూస్తూ భారత్ 240 పరుగులే చేసేసరికి.. భారత్ గెలవదని టెన్షన్ పడ్డాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి టెన్షన్ తోనే మ్యాచ్ చూస్తూ ఉన్నాడు. టీమిండియా ఓడిపోవడం చూశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర ప్లేయర్స్ కన్నీళ్లు పెట్టుకోవడం చూశాడు. అంతే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన స్నేహితులు అతడిని తిరుపతిలోని ఓ ఆసుపత్రికి తరలించినా.. ఫలితం లేకపోయింది. అప్పటికే జ్యోతి కుమార్ చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.
జ్యోతి కుమార్ ది తిరుపతిలోని దుర్గసముద్రం. క్రికెట్ అంటే చాలా ఇష్టం. భారత్ ఏ మ్యాచ్ లో ఓడిపోయినా అస్సలు తట్టుకోలేడు. తాజాగా భారత్ ఓటమిని జీర్ణించుకోలేక గుండెపోటుతో జ్యోతి కుమార్ చనిపోయాడు. దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Cumin water : చిన్నగా కనిపించే జీలకర్ర మన వంటగదిలో తప్పనిసరిగా ఉండే పదార్థం. పోపు వేయాలన్నా, పప్పు లేదా…
Today Horoscope 11th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి 11, 2026 బుధవారం నాడు ద్వాదశ…
PAK vs USA: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
Congress Party : మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి…
Ram Charan Upasana twins : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ mega power star Ram Charan …
Ys Jagan : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా…
Xiaomi 17T Pro : కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని అనుకుంటున్న వారికి ఇది నిజంగా సూపర్ న్యూస్. ప్రముఖ మొబైల్…
This website uses cookies.