Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!
ప్రధానాంశాలు:
Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టిన కూటమి నేతలకు, ఇప్పుడు అదే అంశం రివర్స్ అస్త్రంలా మారబోతోందని రాజకీయ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సిట్ దాఖలు చేసిన ఫైనల్ చార్జ్ షీట్లో లడ్డూ నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని తేలడంతో జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఆయుధం దొరికినట్లయింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయకుండా జాతీయ స్థాయిలో రచ్చ చేసి, కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలతో ఆడుకుందని నిలదీయడానికి వైసీపీ గట్టి స్కెచ్ వేస్తోంది. అబద్ధపు ప్రచారంతో తమ పార్టీ పరువు తీశారని, ఇప్పుడు నిలదీసే సమయం వచ్చిందని వైసీపీ కేడర్ ఫుల్ జోష్లో ఉంది. ఇక రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల మీద జరిగిన దాడులు.
Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!
ఏకంగా పెట్రోల్ బాంబులు వేసే వరకు పరిస్థితి వెళ్లిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ దాడులను జగన్ చాలా సీరియస్గా తీసుకున్నారు. కేవలం ఇక్కడ ధర్నాలు చేయడం కాకుండా, నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని, అలాగే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ దృష్టికి ఈ భౌతిక దాడుల విషయాన్ని తీసుకెళ్తామని ప్రకటించడం కూటమి నేతలను కలవరపెడుతోంది. ముఖ్యంగా జాతీయ మీడియాలో ఈ అంశాలను హైలైట్ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. మరో ఆసక్తికరమైన చర్చ ఏంటంటే, ఈ దాడులు ఎదుర్కొన్న అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇద్దరూ వంగవీటి మోహన రంగా అనుచరులుగా పేరున్న వారు. గతంలో రంగా హత్య జరిగినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపే వేళ్లు చూపించారు. ఇప్పుడు మళ్ళీ రంగా అనుచరులనే టార్గెట్ చేసి దాడులు చేయించడం వెనుక పెద్ద కుట్ర ఉందనే వాదనను వైసీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.
దీనివల్ల కాపు సామాజిక వర్గంలో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వంగవీటి రంగా అభిమానులను రెచ్చగొట్టేలా ఈ దాడులు ఉన్నాయని చెప్పడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోంది. మొత్తానికి చూస్తే, అటు లడ్డూ వివాదం చార్జ్ షీట్, ఇటు నేతల ఇళ్లపై దాడులు.. ఈ రెండూ జగన్ చేతికి చిక్కిన కొత్త అస్త్రాల్లా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు డిఫెన్స్లో ఉన్న వైసీపీ, ఇప్పుడు అటాకింగ్ మూడ్లోకి వచ్చేసింది. ఈ పరిణామాలతో కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయిందని, రాబోయే రోజుల్లో ఢిల్లీ స్థాయిలో ఈ గొడవ ఇంకా పెద్దదయ్యే సూచనలు ఉన్నాయని అర్థమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు మామూలు హీటు మీద లేవు, త్వరలోనే మరిన్ని సంచలనాలు చూసే అవకాశం ఉంది.