Jagan Mohan Reddy : జగన్ ఇచ్చిన మూడు హామీలే ఆయనకి నిద్ర లేకుండా చేస్తున్నాయా...!
YS Jagan : ఐదేళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ఇటీవల ఎన్నికలలో దారుణమైన ఓటమి చెందారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు ఆయన సరికొత్త ప్రణాళికలు రచిస్తూ బిజీబిజీగా ఉన్నారు.రెండు వారాల వ్యవధిలోనే పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి మరోసారి బెంగళూరుకు వెళ్తున్నారు. జూన్ 24నే బెంగళూరు వెళ్ళిన ఆయన.. జులై 1వరకు అక్కడే ఉండి వచ్చారు. ఇప్పుడు మళ్లీ బెంగళూరుకు వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఈ వరుస పర్యటనల మర్మం ఏంటనే చర్చ జరుగుతోంది.
గత నెల 24న బెంగళూరు వెళ్లిన జగన్.. ఈ నెల 1 వరకు అక్కడే ఉన్నారు. మళ్లీ రెండు వారాల వ్యవధిలోనే బెంగళూరు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువశాతం పులివెందుల, బెంగళూరులోనే ఉన్నారు. ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. మరి ఈ సమావేశాలకు జగన్ వస్తారా లేదా అన్నది కూడా చూడాలి. అసెంబ్లీకి హాజరుకావడంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం మాత్రం లేదు. కాలికి వైద్యం కోసం బెంగళూరు వెళుతున్నారనే ప్రచారంతో.. అసెంబ్లీకి వస్తారా?.. విశ్రాంతి కోసం బెంగళూరులోనే ఉంటారా అనేది చూడాలంటున్నారు. వాస్తవానికి జగన్ సోమవారం నుంచి తాడేపల్లిలోని నివాసంలో ప్రజా దర్భార్ ప్రారంభించాలని భావించారు. వైఎస్సార్సీపీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని జగన్ కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించారు.. కానీ బెంగళూరు పర్యటనతో వాయిదా వేశారు.
YS Jagan : మళ్లీ బెంగళూరుకు జగన్.. ఏం చేయబోతున్నాడంటూ అందరిలో టెన్షన్..!
శాసన సభ సమావేశాల వేళ జగన్ రెడ్డి బెంగళూరులోనే ఉంటే మాత్రం అది విమర్శలకు తావిస్తుంది. కాబట్టి ఆయన వారం రోజులకు తిరిగి వస్తారని, కానీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై పార్టీ నేతలతో మరోసారి చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వైఎస్సార్సీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జగన్ను కలిసినట్లు ప్రచారం జరిగింది.. అలాగే పలువురు నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్సార్సీపీ మాత్రం ఇదంతా తప్పుడు ప్రచారమని కొందరు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.