Ys Jagan : జగన్ ఆశలపై చంద్రబాబు మెల్లమెల్లగా నీళ్లు చల్లుతున్నాడేంటి ?
Ys Jagan : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది. వైసీపీ దారుణంగా పరాజయం పాలైంది. దీంతో వచ్చే ఎన్నికలలో మంచి విజయం సాధించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో జోరు పెంచారు. విమర్శలు గుప్పిస్తున్నారు. ఆరు మాసాల్లోనే సర్కారు విఫలమైందని ఆయన కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. కూటమి సర్కారుకు ప్రజలు బుద్ధి చెబుతారని కూడా ఆయన అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును తీసుకువచ్చింది. ఇప్పటికే కేంద్రం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని పార్లమెంటులో ఆమోదించుకుని.. రాజ్యాంగానికి కొన్ని సవరణలు చేసి.. ఈ బిల్లును ఆమోదించుకుంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ ఒకే సారి ఎన్నికలు వస్తాయి.
Ys Jagan : జగన్ ఆశలపై చంద్రబాబు మెల్లమెల్లగా నీళ్లు చల్లుతున్నాడేంటి ?
ఏపీలో ప్రస్తుతం మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటిల్లో టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కూటమిలో బీజేపీ ఉన్నా.. ఓట్లు, సీట్లు మాత్రం ఈ రెండు పార్టీల కంటే తక్కువే. మరోవైపు వైసీపీ ఉంది. వైసీపీ సింగిల్ పోటీ చేసి 2019లో ఘనవిజయం సాధించింది. 2024లో మాత్రం ఊహించని స్థాయిలో పరాజయం పాలైంది. ఓటమి తర్వాత కొన్నిరోజులు కామ్గా ఉన్న వైసీపీ నేతలు.. ఇటీవల యాక్టివ్ అయ్యారు. జమిలి ప్రకటనలపై ఆశగా ఎదురుచూస్తున్నారు.జమిలి ఎన్నికలు జరిగితే.. వైసీపీకే లాభం అని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. జమిలి అంటున్నారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆర్గనైజ్డ్గా ఉంటే మనం సన్నద్ధంగా ఉంటామని పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
జమిలి ఎన్నికలు వస్తున్నాయనే జగన్ రోడ్డు మీదకు వస్తున్నారని.. తమను కూడా రమ్మంటున్నారని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ విషయం వైసీపీలోనూ చర్చగానే మారింది. మొత్తంగా జగన్ ఆశలు ఇప్పుడు జమిలిపైనే ఉన్నాయి. వచ్చే నాలుగున్నరేళ్ల పాటు ఆయన సైలెంట్గా ఉండే పరిస్థితి లేదు. ఈ క్రమంలో జమిలికి అనుకూలంగా వైసీపీ ఎంపీలు కూడా మద్దతు తెలపనున్నారు. ఈ ఎన్నికలు వస్తే.. ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకురావాలన్నది జగన్ తాలూకు ఆలోచనగా ఉంది. కాని చంద్రబాబు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదే అధికారం అని అంటున్నారు. ఒకవేళ బీజేపీ అనుకున్నట్టు జరిగితే.. 2027 మార్చి తర్వాత ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి ఇలానే ఉంటుందా అని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…
Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
This website uses cookies.