Categories: NewsTelangana

Good News : శుభ‌వార్త చెప్పిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారికి 12వేల ఆర్ధిక స‌హాయం చేస్తామంటూ ప్ర‌క‌ట‌న‌..!

Advertisement
Advertisement

Good News : తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌ల వ‌రాల జ‌ల్లు ప్ర‌క‌టిస్తుంది. తాజాగా తెలంగాణలో భూమిలేని నిరుపేదలకు 12 వేల ఆర్థిక సాయం ఇవ్వబోతున్నట్టు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. రెండు విడతలుగా ఇచ్చే సాయం తొలి దఫా నిధులు ఆరు వేల రూపాయలను ఈ నెల 28న విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్‌ 28ని నిధుల విడుదలకు ముహూర్తంగా ఎంచుకున్నారు. భూమి ఉన్న రైతులకు ఇప్పటికే ఏటా 12 వేల రూపాయాలను ప్రభుత్వం ఇస్తోంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీన్ని సంక్రాంతి నుంచి ఇస్తామంటూ ప్రభుత్వం చెబుతోంది.

Advertisement

Good News : శుభ‌వార్త చెప్పిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారికి 12వేల ఆర్ధిక స‌హాయం చేస్తామంటూ ప్ర‌క‌ట‌న‌..!

Good News  సాధ్య‌మేనా?

ఆరు నెలలకు రూ.6 వేల చొప్పున ఏడాదిలో రెండు విడతలుగా ఈ మొత్తాన్ని పంపిణీ చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న గోబెల్స్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే కేటీఆర్‌, హరీశ్‌రావు చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో డిప్యూటీ సీఎం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అప్పులపై బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలను పక్కదారి పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి, రైతుల సంక్షేమం కోసం రూ.50,953 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతులకి మరింత మేలు జరగాలనే సన్నాలపై క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని చెప్పారు. తద్వారా రైతులు ప్రతి ఏకరాకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకూ అదనంగా లాభాలు అందుకుంటున్నారని తెలిపారు.

Advertisement

తెలంగాణలో భూమి లేని పేదలను గుర్తించేందుకు ఎలాంటి సర్వే ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టలేదు. పదేళ్లుగా చాలా రకాల సర్వేలు ప్రకటించినప్పటికీ ఈ భూమి లేని నిరుపేదల విషయంలో ఎలాంటి లెక్కలు లేవని తెలుస్తోంది. ఈ మధ్య ప్రభుత్వం చేపట్టిన సర్వేలు ఏవీ పూర్తిగా కొలిక్కి రాలేదు. వాటిని ఆధారంగా చేసుకునేందుకు కూడా వీలు లేదు. అందుకే రెవెన్యూ రికార్డులతోపాటు ఉపాధి హామీ పథకాన్ని ఆధారంగా చేసుకుంటుందా అనే అనుమానం ఉంది. అసలు అర్హులను ఎలా గుర్తిస్తారు. భూమి లేని వారిని ఏ ప్రతిపాదికన ఎంపిక చేస్తారనే చర్చ కూడా ఉంది. ఎంతలా కుదించినప్పటికీ పాతిక నుంచి 30 లక్షల కుటుంబాలకు మాత్రం ఈ పథకాన్ని వర్తింపజేయాల్సి ఉంది. అంటే దాదాపు 15 నుంచి 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. సంవత్సరానికి అంటే మూడు నుంచి 3వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాలి.

Recent Posts

Virat Kohli – Gautam Gambhir: గంభీర్‌తో కోహ్లీ, రోహిత్‌కు ఎలాంటి విభేదాలు లేవు .. బ్యాటింగ్ కోచ్ కామెంట్స్ వైర‌ల్

Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…

3 hours ago

Bhartha mahasayulaku vignapthi | బాక్స్ ఆఫీస్ వద్ద ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్ .. అంచనాలకు తగ్గలేదు

Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…

5 hours ago

iPhone 15 : ఐఫోన్ కొనాలనే కోరిక ఉన్న ధర ఎక్కువని కొనలేకపోతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్

iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…

6 hours ago

Pawan Kalyan : రాజకీయ నాయకుల కోసం ప్రజలను ఇబ్బంది పెడతారా అంటూ పవన్ హీరోయిన్ ఆగ్రహం

Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…

7 hours ago

Nara Lokesh : యాక్షన్ కు సిద్దమైన నారా లోకేష్.. వణికిపోతున్న సొంత పార్టీ నేతలు

Nara Lokesh  : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…

8 hours ago

Eating : భోజనం చేయగానే ఆ పని అస్సలు చేయకూడదు..!

Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…

9 hours ago

Udyogini Scheme : మహిళల కోసం ‘ఉద్యోగిని పథకం 2026’ ను తీసుకొచ్చిన కర్ణాటక ప్రభుత్వం, దీనికి ఎలా అప్లయ్ చేయాలంటే !!

Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…

10 hours ago

NIT Warangal Recruitment 2026: నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త..NIT లో పెద్ద ఎత్తున జాబ్స్ మీరు అప్లై చేసుకోవడమే ఆలస్యం !1

NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…

11 hours ago