YS Sharmila : సాక్షిలో నాకు వాటా ఉంది.. బయటపడ్డ అన్నా - చెల్లి ఆస్తి గొడవలు..!
YS Sharmila : ఏపీ రాజకీయాలలో వైయస్ షర్మిల కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి సెన్సేషనల్ గా మారారు. ఆమె మొదటి రోజు నుంచి తన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా కడప జయ గార్డెన్స్ లో ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి హాజరైన వైయస్ షర్మిల మరోసారి తన అన్న వైయస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మాట్లాడుతూ.. తన తండ్రి పాలనకు, ఇప్పుడున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. వైసీపీని అధికారంలో తేవటానికి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, జగనన్న కోసం అంత గొప్ప త్యాగం చేస్తే తనపైన ముకుమ్మడిగా దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకొక జోకర్ గాడు బయటికి వచ్చి తనపై వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారని, రోజుకు ఒక కథ పుట్టించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు.
ప్రణబ్ ముఖర్జీతో నా భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని మాట్లాడుతున్నారని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైయస్ జగన్ జైల్లో పెట్టి నేను ముఖ్యమంత్రి కావాలని బ్రదర్ అనిల్ కోరినట్లు విష ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధం అని వైయస్ షర్మిల చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ వద్దకు అనిల్ భారతీ రెడ్డితో కలిసే వెళ్లారని గుర్తు చేశారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు. పదవీ కాంక్ష ఉంటే నాన్న సీఎం గా ఉన్నప్పుడే తీసుకునే వాళ్ళం కదా అని వైయస్ షర్మిల ప్రశ్నించారు. జగనన్న కోసం పాదయాత్ర చేసినప్పుడు కూడా నేను పదవి అడగలేదని వైసీపీ వారికి దమ్ముంటే అది నిరూపించండి అని సవాల్ విసిరారు. ఇక సాక్షి పత్రికలు నాపైన వ్యక్తిగతంగా వార్తలు రాస్తున్నారు అని, ఆ పత్రికలో జగనన్నకు ఎంత భాగస్వామ్యం ఉందో నాకు అంతే భాగస్వామ్యం ఉందని వైయస్ షర్మిల స్పష్టం చేశారు.
ఈ విషయం మరిచి సాక్షి పత్రిక ఇష్టం వచ్చినట్లు తనపై వార్తలు రాస్తుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఏం చేసినా, ఏం రాసినా భయపడే ప్రసక్తే లేదని ఘాటుగా సమాధానం ఇచ్చారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఒక కలలా మిగిలిపోయిందని వైయస్సార్ బ్రతికి ఉంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేది అని, అంతేకాకుండా కడప జిల్లాకు ఆయన ఇంకా ఎంతో చేసేవారని వైయస్ షర్మిల అన్నారు. జగనన్న కడప జిల్లా వాసిగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయలేకపోయారని, కడప బెంగుళూరు రైల్వే నిర్మాణం ఆగిపోయేలా చేశారని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను ఇప్పటివరకు ఆదుకోలేదని అన్నారు. ఇంకా జగనన్నకు కడప జిల్లా పై ప్రేమ ఉందని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. బీజేపీకి వైసీపీ బానిసై అన్ని విషయాలలో మద్దతు ఇస్తుందని అన్నారు. దీంతో వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు సాక్షి పత్రికలో ఆమెకు తన అన్న వైయస్ జగన్ కు భాగస్వామ్యం ఉందని చెప్పడంతో ఇద్దరి మధ్య ఉన్న ఆస్తి గొడవలు బయటపడ్డాయి అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు…
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…
This website uses cookies.