YS Sharmila : సాక్షిలో నాకు వాటా ఉంది.. బయటపడ్డ అన్నా - చెల్లి ఆస్తి గొడవలు..!
YS Sharmila : ఏపీ రాజకీయాలలో వైయస్ షర్మిల కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి సెన్సేషనల్ గా మారారు. ఆమె మొదటి రోజు నుంచి తన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా కడప జయ గార్డెన్స్ లో ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి హాజరైన వైయస్ షర్మిల మరోసారి తన అన్న వైయస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మాట్లాడుతూ.. తన తండ్రి పాలనకు, ఇప్పుడున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. వైసీపీని అధికారంలో తేవటానికి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, జగనన్న కోసం అంత గొప్ప త్యాగం చేస్తే తనపైన ముకుమ్మడిగా దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకొక జోకర్ గాడు బయటికి వచ్చి తనపై వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారని, రోజుకు ఒక కథ పుట్టించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు.
ప్రణబ్ ముఖర్జీతో నా భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని మాట్లాడుతున్నారని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైయస్ జగన్ జైల్లో పెట్టి నేను ముఖ్యమంత్రి కావాలని బ్రదర్ అనిల్ కోరినట్లు విష ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధం అని వైయస్ షర్మిల చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ వద్దకు అనిల్ భారతీ రెడ్డితో కలిసే వెళ్లారని గుర్తు చేశారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు. పదవీ కాంక్ష ఉంటే నాన్న సీఎం గా ఉన్నప్పుడే తీసుకునే వాళ్ళం కదా అని వైయస్ షర్మిల ప్రశ్నించారు. జగనన్న కోసం పాదయాత్ర చేసినప్పుడు కూడా నేను పదవి అడగలేదని వైసీపీ వారికి దమ్ముంటే అది నిరూపించండి అని సవాల్ విసిరారు. ఇక సాక్షి పత్రికలు నాపైన వ్యక్తిగతంగా వార్తలు రాస్తున్నారు అని, ఆ పత్రికలో జగనన్నకు ఎంత భాగస్వామ్యం ఉందో నాకు అంతే భాగస్వామ్యం ఉందని వైయస్ షర్మిల స్పష్టం చేశారు.
ఈ విషయం మరిచి సాక్షి పత్రిక ఇష్టం వచ్చినట్లు తనపై వార్తలు రాస్తుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఏం చేసినా, ఏం రాసినా భయపడే ప్రసక్తే లేదని ఘాటుగా సమాధానం ఇచ్చారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఒక కలలా మిగిలిపోయిందని వైయస్సార్ బ్రతికి ఉంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేది అని, అంతేకాకుండా కడప జిల్లాకు ఆయన ఇంకా ఎంతో చేసేవారని వైయస్ షర్మిల అన్నారు. జగనన్న కడప జిల్లా వాసిగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయలేకపోయారని, కడప బెంగుళూరు రైల్వే నిర్మాణం ఆగిపోయేలా చేశారని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను ఇప్పటివరకు ఆదుకోలేదని అన్నారు. ఇంకా జగనన్నకు కడప జిల్లా పై ప్రేమ ఉందని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. బీజేపీకి వైసీపీ బానిసై అన్ని విషయాలలో మద్దతు ఇస్తుందని అన్నారు. దీంతో వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు సాక్షి పత్రికలో ఆమెకు తన అన్న వైయస్ జగన్ కు భాగస్వామ్యం ఉందని చెప్పడంతో ఇద్దరి మధ్య ఉన్న ఆస్తి గొడవలు బయటపడ్డాయి అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…
Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
This website uses cookies.