
YS Vijayamma : జగన్ కు షాక్ ఇచ్చిన విజయమ్మ.. ఆస్తులు పంచలేదు సాక్షి నేనే..!
YS Vijayamma : ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ Ys Jagan కి ఫ్యామిలీ మెంబర్స్ నుంచే శత్రుత్వం మొదలైంది. జగన్ వర్సెస్ షర్మిల Ys Sharmila ఇద్దరి మధ్య జరుగుతున్న ఆస్తి Assets యుద్ధంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. ఐతే జగన్, షర్మిల ఆస్తి గొడవలపై విజయమ్మ ఎవరికి సపోర్ట్ ఇస్తుందా అని ఇన్నాళ్లు చిన్న కన్ ఫ్యూజన్ ఉంది. ఐతే నేడు ఆ కన్ ఫ్యూజన్ కి తెర దించుతూ జగన్, షర్మిల ఆస్తి తగాదాలపై ఆమె స్పందించారు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతి ఒక్కరికి విజయమ్మ చేస్తున్న అభ్యర్ధన అంటూ ఆమె ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.తాజా సంఘటనలు మనసుకి చాలా బాధ కలిగిస్తున్నాయని అన్న విజయమ్మ రాజశేఖర్ రెడ్డి గారి జీవితం తెరచిన పుస్తకం అని.. అయితే తన కుటుంబానికి ఏ దిష్టి తైలిందో జరగకూడనివి అన్ని కళ్ల ముందే జరిగిపోతున్నాయని విజయమ్మ అన్నారు. తమ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నారని అన్నారు. చాలామంది తెలియకుండానే మాట్లాడుతున్నారని అన్నారు. ఇది కొనసాగితే తన పిల్లైద్దరికే కాదు రాష్ట్రానికే మంచిది కాదని అన్నారు విజయమ్మ.
తన ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడేవారందరిని మా జీవితంలో మీరు భాగమే అనుకుంటున్నా. ఇది రాజశేఖర్ రెడ్డి Ys Rajasekar reddy కుటుంబం. ఆయనకు మేమెంతో మీరు అంతే.. ఆయన మమ్మల్ని ప్రేమించినట్టే.. మిమ్మల్ని ప్రేమించారు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయాక కూడా ఆదరించి అక్కున చేర్చుకున్నారని విజయమ్మ అన్నారు.
దయచేసి కుటుంబం గురించి.. పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దని కోరారు విజయమ్మ. సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దని అన్నారు. వైఎస్ కుటుంబం మీద మీకు ప్రేమ ఉంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దని అన్నారు విజయమ్మ. బ్లడ్ ఈజ్ థికర్ ద్యాన్ వాటర్. వాళ్లు ఇదరు సమాధాన పడతారు. మీరు ఎవరు రెచ్చగొట్టొద్దని అన్నారు. తాను నమ్మిన యేసయ్య తన బిడ్డల సమస్యలకు పరిష్కారం చూపిస్తాడనే నమ్మకం ఉందని విజయమ్మ అన్నారు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయి రెడి వారు మాట్లాడుతున్నై వాళ్లు ప్రేమించిన వైఎస్సార్ గురించి అని మరచి ఆయన కుటుంబ పరువు తీస్తున్నారని స్ప్రుహ లేకుండా అసత్యాలు చెప్పారని అన్నారు. వైఎస్సార్ బ్రతికు ఉండగానే ఆస్తులు పంచారని అన్నారని.. అది అవాస్తవమని అన్నారు. వైఎస్సార్ పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజూ నుంచి కొన్ని ఆస్తులు పాప పేరు మీద.. కొన్ని జగన్ పేరు మీద పెట్టారు. అంతేకానీ ఆస్తులు పంచలేదని అన్నారు విజయమ్మ. వైఎస్ బ్రతికున్నప్పుడే షర్మిలకు ఆస్తులు ఇచ్చారని అన్నారు. ఐతే జగన్ పేరు మీద ఉన్న ఆస్తుల లిస్ట్ కూడా చదివి ఉండాల్సిందని అన్నారు.
YS Vijayamma : జగన్ కు షాక్ ఇచ్చిన విజయమ్మ.. ఆస్తులు పంచలేదు సాక్షి నేనే..!
వైఎస్ ఇంకా ఆస్తులు పంచలేదని. కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేర్లు మీద పెట్టారని అన్నారు విజయమ్మ. ఆస్తులు ఇద్దరికి సమానం అనేది నిజమని.. నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా ఉండాలన్నై వైఎస్ ఆజ్ఞ అని ఆమె అన్నారు. ఐతే ఆస్తులు వృద్ధిలోకి రావడంలో జగన్ కష్టం ఉందనేది నిజమే కానీ ఆస్తులు అన్ని కుటుంబ ఆస్తులే అన్నది నిజమని అన్నారు. ఆయన చివరి రోజుల్లో జగన్ ఆయనకు మాట ఇచారని.. నాన్న నీ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరే వారిలో నేను మొదటి వారిని అని అన్నాడు. అది నిజమని అన్నరు. మొత్తానికి వైఎస్ విజయమ్మ లేఖ వైసీపీ కేడర్ లో సంచలనంగా మారింది.
Income Tax Rules : దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. దశాబ్దాలుగా ఉపయోగంలో ఉన్న ఫారమ్…
NCC Jobs : భారత సైన్యంలో అధికారిణిగా సేవ చేయాలని ఆశిస్తున్న మహిళలకు శుభవార్త. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న…
New DWCRA Schemes 2026 : మహిళా సాధికారతకు మరో ముందడుగు వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త…
Indian Postal GDS recruitment 2026 : దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ GDS పోస్టుల…
Gold Price 17 February 2026 Today : పసిడి ప్రియులకు ఇది నిజంగానే చల్లటి వార్త. గత కొన్ని…
Brahmamudi 2026 February 17th Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ 'బ్రహ్మముడి' Brahmamudi రోజుకో…
Karthika Deepam 2 February 17th 2026 Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ 'కార్తీక దీపం 2'…
Vitamin B Foods: మన శరీరం ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే విటమిన్లు చాలా అవసరం. అందులోనూ 'విటమిన్ బి' Vitamin…
This website uses cookies.