Business Idea : కోవిడ్ వల్ల జాబ్ పోతే.. రాజ్మా చావల్ అమ్ముతూ నెలకు 60 వేలు సంపాదిస్తున్న యువజంట
Business Idea : కొవిడ్ ప్రపంచదేశాలన్నింటికీ తీవ్ర నష్టాలు తెచ్చిపెట్టింది. ఆర్థికంగా కుంగదీసింది. చాలా కంపెనీలు మూతపడగా… చాలా మంది తమ ఉద్యోగాలను, ఉపాధి మార్గాలను కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కానీ కొందరికి లాక్ డౌన్ కొత్త ఉపాధి మార్గాలను తెచ్చిపెట్టింది. ఢిల్లీకి చెందిన కరణ్, అమృత కూడా కరోనా వల్ల ఉపాధి కోల్పోయారు. కొన్నాళ్లపాటు కరణ్ ఓ పార్లమెంటు సభ్యుడి వద్ద డ్రైవర్గా పనిచేశాడు. కానీ COVID-19 మహమ్మారి రాకతో అతని ఉద్యోగం పోయింది. కరణ్ అమృత దంపతులు ఆశ్రయాన్ని, ఆదాయ వనరును కోల్పోయారు.
కరణ్ వ్యక్తి గత మరియు ఆస్తి వివాదాల కారణంగా 2016లో తన కుటుంబం తనను వద్దనుకుందని, వారి సహాయం కోసం తాను అడగలేకపోయానని చెప్పాడు. నాకు ఉద్యోగం దొరికేంత వరకు తన అత్తమామలు ఉండడానికి కొంత స్థలాన్ని అందించారని తెలిపాడు కరణ్. వారి కారును కూడా వాడుకునేందుకు ఇచ్చారని అంటాడు కరణ్. పగలంతా ఉద్యోగాల కోసం తిరిగే వారు. ఆకలి తీర్చుకోవడానికి బంగ్లా సాహిబ్ మరియు రకబ్ గంజ్ గురుద్వారాలలో తిన్నారు. పబ్లిక్ టాయిలెట్లలో కాలకృత్యాలు తీర్చుకునేవారు. కానీ ఎంతో కాలం ఇలా ఉండలేమని వారు గుర్తించారు. ఆహారం అందించే వ్యాపారం ప్రారంభించాలని అమృత కరణ్ కు సూచించింది.చోలే, రాజ్మా, కడియం పకోడా, అన్నం అమ్మాలని సూచించింది

Business Idea lost job to covid 19 delhi couple sell rajma chawal food from car
అమృత. కొంతమంది స్నేహితులు మరియు కరణ్ వాళ్ల నాన్న కొంత ఆర్థిక సాయం చేశారు. మండిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఆహారం వండాలని నిర్ణయించుకున్నారు. దంపతులిద్దరూ తెల్లవారుజామున 3.30 గంటలకు మేల్కొని ఆహారం వండుకుని, ఉదయం 10 గంటలకు ఇంటి నుండి బయలుదేరి భోజనం విక్రయించడానికి స్థలాలకు వెళ్లేవారు. కస్టమర్ల కోసం మేము అనేక ప్రదేశాలను ప్రయత్నించారు. లాక్డౌన్ ఆంక్షలు వారి ఇబ్బందులను మరింత పెంచాయి. కానీ ఒక నెల తర్వాత, తల్కటోరా స్టేడియం దగ్గర కస్టమర్లు వారి దగ్గరకు రావడం మొదలుపెట్టారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 నుండి 4 గంటల మధ్య తల్కతోరా స్టేడియం జంక్షన్లో పైపింగ్ వేడి రాజ్మా, చోలే, కడి, అన్నం మరియు చల్లబడిన మజ్జిగను విక్రయిస్తున్నారు. ఒక రోజులో కనీసం 100 మంది కస్టమర్లకు సేవలు అందిస్తారు.