Business Idea : వాడిలాల్.. స్వాతంత్రానికి ముందు 1907లో గుజరాత్లో ప్రారంభించిన బ్రాండ్. అద్భుతమైన టేస్టు తో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రసిద్ధి చెందిన ఫేమస్ బ్రాండ్గా కొనసాగుతూ వస్తోంది. కానీ ప్రారంభించిన రంగం వేరు ఇప్పుడు రాణిస్తున్న రంగం వేరు. 1907 లో సోడా అమ్మేందుకు వాడిలాల్ను ప్రారంభించి.. క్రమంగా ఐస్ క్రీమ్ వైపు మళ్లించారు. ప్రస్తుతం 200 రకాల ఐస్ క్రీములను అందిస్తోంది వాడిలాల్. వాడిలాల్ 1926లో తన మొదటి ఐస్ క్రీం అవుట్లెట్ను ప్రారంభించింది. అదే సంవత్సరంలో మొదటిసారిగా, జర్మనీ నుండి ఐస్క్రీం తయారీ యంత్రాన్ని దిగుమతి చేసుకున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి, వాడిలాల్ సంస్థ అహ్మదాబాద్ అంతటా నాలుగు ఔట్ లెట్లను తెరిచింది.
70వ దశకం నాటికి ఔట్ లెట్ల సంఖ్య 10 కి చేరింది. వాడిలాల్ తన కస్టమర్లతో ఎల్లప్పుడూ మంచి కమ్యూనికేషన్ ఏర్పరచుకుంది. వారి సలహాలు, సూచనలు జోడిస్తూ.. తమ ఐస్ క్రీమ్లను వారు ఇష్టపడేలా తయారు చేయడం ప్రారంభించారు. ఐస్ క్రీమ్ తయారీలో కొంత ఎగ్ కలుపుతారని అనుకుంటుంటారు. దానినీ వాడిలాల్ తమ అభివృద్ధికి ఉపయోగించుకుంది. అది ఎలాగంటే.. తమ ఐస్ క్రీమ్లు 100 శాతం శాఖాహారమైనవని.. మతపరమైన కార్యక్రమాల్లో ఉపవాస సమయాల్లోనూ తమ ఐస్ క్రీమ్లను తినొచ్చని వాడిలాల్ ప్రచారం చేసుకుంది. క్రమంగా వాడిలాల్ బ్రాండ్ పెరుగుతూ వచ్చింది. 1990లో స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయింది. అదే సంవత్సరంలో… కుటుంబ కలహాల వల్ల కంపెనీలో చీలికలు వచ్చాయి.
అయినా వాడిలాల్ వృద్ధి సాధిస్తూనే వచ్చింది. 90వ దశకం ప్రారంభంలో, వాడిలాల్ కంపెనీ ప్రాసెస్డ్ ఫుడ్ రంగంలోకి ప్రవేశించింది. వాడిలాల్ క్విక్ ట్రీట్ను ప్రారంభించి… 1995లో, అమెరికాకు కూరగాయలను ఎగుమతి చేసింది. ప్రస్తుతం వాడిలాల్.. యూ.ఎస్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న భారతీయ ఐస్ క్రీం బ్రాండ్గా కొనసాగుతోంది. కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని 45 దేశాలకు వాడిలాల్ ఐస్ క్రీమ్ సప్లై అవుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 650 కోట్ల ఆదాయాన్ని సాధించింది వాడిలాల్. వ్యాపారాన్ని నైతికంగా నిర్వహించడం బ్రాండ్ నేమ్ పెరిగేందుకు చాలా ముఖ్యమైని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.