EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ .. ఇక పై ఏటీఎం ద్వారా సెకన్లలోనే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు .. వివరాలివే ..!
ప్రధానాంశాలు:
EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ .. ఇక పై ఏటీఎం ద్వారా సెకన్లలోనే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు .. వివరాలివే ..!
EPFO : దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా ఒక ముఖ్యమైన భద్రతా సాధనం. ఉద్యోగ విరమణ తర్వాత లేదా అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఇప్పటివరకు పీఎఫ్ డబ్బులను ఉపసంహరించుకోవడం కొంత క్లిష్టమైన ప్రక్రియగా ఉండేది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్వో 3.0 వెర్షన్ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వెర్షన్ ద్వారా సేవలను మరింత వేగవంతం చేసి, వినియోగదారులకు సౌకర్యవంతంగా మార్చే దిశగా కీలక మార్పులు చేపడుతోంది. ముఖ్యంగా క్లెయిమ్ సెటిల్మెంట్ విధానంలో పెద్ద మార్పులు తీసుకురానుంది.
You can withdraw PF money within seconds through ATM.
EPFO : ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రా .. ఇక సెకన్లలో నగదు
ఈపీఎఫ్వో 3.0లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ పీఎఫ్ డబ్బులను ఏటీఎం ద్వారా ఉపసంహరించుకునే అవకాశం. ఇప్పటివరకు పీఎఫ్ సొమ్మును తీసుకోవాలంటే ఆన్లైన్లో క్లెయిమ్ పెట్టి కనీసం రెండు నుంచి మూడు రోజుల వరకు వేచి చూడాల్సి వచ్చేది. కానీ కొత్త విధానంలో ఈ సమస్య పూర్తిగా తొలగిపోనుంది. ఖాతాదారులు తమ సమీపంలోని ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా నేరుగా నగదును తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం కోసం ఈపీఎఫ్వో ప్రత్యేక ఏటీఎం కార్డులను జారీ చేయనుంది. ఈ కార్డు సాధారణ డెబిట్ కార్డు లాగానే పనిచేస్తుంది. వినియోగదారులు తమ పీఎఫ్ ఖాతాలోని మొత్తంలో 75 శాతం వరకు ఏటీఎం ద్వారా ఉపసంహరించుకోవచ్చు. ఒక్కసారిగా గరిష్టంగా రూ.2 లక్షల వరకు తీసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులకు అత్యవసర సమయంలో వెంటనే నగదు అందుబాటులోకి రానుంది.
EPFO : పన్నులు, పరిమితులు .. ఏమి తెలుసుకోవాలి?
పీఎఫ్ విత్డ్రా విషయంలో కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. ఉద్యోగి మూడు సంవత్సరాల సేవ పూర్తి చేసిన తర్వాత రూ.2 లక్షల వరకు డబ్బు తీసుకుంటే 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. అయితే ఐదు సంవత్సరాల సేవ పూర్తయిన తర్వాత ఉపసంహరణపై ఎలాంటి పన్నులు ఉండవు. ఇది దీర్ఘకాలిక సేవ చేసిన ఉద్యోగులకు పెద్ద ప్రయోజనంగా మారుతుంది. అత్యవసర అవసరాలైన వైద్య ఖర్చులు, గృహ అవసరాలు లేదా ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో పీఎఫ్ మొత్తంలో 75 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. మిగతా 25 శాతం మాత్రం ఉద్యోగం పూర్తిగా ముగిసిన తర్వాత మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం ఉద్యోగుల భవిష్యత్ భద్రతను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది.
EPFO : యూపీఐ ద్వారా చెల్లింపులు .. మరింత డిజిటల్ వైపు అడుగు
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో ఈపీఎఫ్వో మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో యూపీఐ ద్వారా పీఎఫ్ చందాలను చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మొదటగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీమ్ యాప్లో ఈ ఫీచర్ ప్రవేశపెట్టనున్నారు. తరువాత దశల్లో ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే వంటి ప్రముఖ యాప్లలో కూడా ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు. ఈ మార్పులతో పీఎఫ్ సేవలు మరింత వేగవంతం, పారదర్శకంగా మారనున్నాయి. ఉద్యోగులకు సమయం ఆదా కావడంతో పాటు అత్యవసర సమయంలో ఆర్థిక భద్రత కూడా పెరుగుతుంది. ఈపీఎఫ్వో 3.0 ఉద్యోగుల కోసం ఒక పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు.