Chanakya Niti : ఆచార్య చాణక్యుడు తన జీవితంలో ఎదురైన ఎన్నో అనుభవాలను పలు పుస్తకాలుగా రచించాడు. చాణుక్యుడు రచించిన నీతిశాస్త్రంలో మానవ జీవిన విధానం, రాజ్యపాలన, మంచి చెడులు ఇలా అనేక విషయాలను ప్రస్తావించాడు. ఈ నీతిశాస్త్రంలో మనిషి జీవిత విధానానికి బంధించిన అనేక విషయాలను చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం తన చుట్టూ ఉన్న వ్యక్తుల గుణగణాలను గుర్తించే సామర్థ్యం లేని వ్యక్తిని ఎవరూ బాగుచేయలేరు. ముఖ్యంగా ఎవరితోనైనా కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండకపోతే జీవితంలో అనుకోని నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే కొందరిని జీవితంలో వదులుకోకూడదని కూడా సుచించాడు. ఈయన నీతిని ఇప్పటికీ చాలా మంది అనుసరిస్తారు.
ఆచార్య చాణక్య ప్రకారం.. ఒక వ్యక్తి జీవితంలో చాలా తప్పులు చేస్తాడు. తరువాత పశ్చాత్తాపపడతాడు. అటువంటి పరిస్థితిలో అందరితో మంచి సంబంధాలను కొనసాగించడం అవసరం. ఒక వ్యక్తితో ఈ నలుగురు వ్యక్తులు వాదించకూడదని చెబుతున్నారు. అవేంటో తెలసుకుందాం..ఆచార్య చాణక్యుడు ప్రకారం ఒక మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకూడదు. దీనివల్ల సమయం వృథా అవుతుంది. మూర్ఖుడు ఎవరి మాట వినడు. అతను తన మాట మాత్రమే మాట్లాడుతాడు. కనుక అలాంటి వ్యక్తి నుంచి దూరంగా ఉండాలి. సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించాడు.గురువు ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తాడు. లక్ష్యాన్ని సాధించడానికి మోటివేట్ చేస్తాడు. గురువు లేకుండా.. మీరు జ్ఞానాన్ని కూడా పొందలేరు.
అటువంటి పరిస్థితిలో మీరు గురువుతో వాదించకుండా ఉండటం ముఖ్యం. ఇది మీ భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాగే జ్ఞానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.ఇష్టమైనవారు జీవితంలో ముందుకు సాగడానికి ఒక వ్యక్తికి ప్రేరణగా నిలుస్తారు. అందువల్ల, మీ ఇష్టమైన వారితో ఎప్పుడూ వాదించకండి. ఇది మీకు హాని కలిగించే అవకాశం ఉంది. అలాగే మన సంతోషాలను భాదలను నిర్భయంగా చెప్పుకునే ఫ్రెండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కడైనా ఉంటాడు. మన రహస్యాలు ఆ స్నేహితుడికి తెలుసు. అందుకే అలాంటి మంచి స్నేహితుడితో ఎప్పుడూ వాదించకండి. ఎందుకంటే అతనికి మీ పై వ్యతిరేకత ఏర్పడితే మీ సీక్రెట్స్ ని ఇతరులకు చెప్పే ప్రమాదం ఉంటుంది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.