Funeral : అంత్యక్రియల సమయంలో నీళ్లతో ఉన్న కుండకి రంధ్రం ఎందుకు పెడతారు?
ప్రధానాంశాలు:
Funeral : అంత్యక్రియల సమయంలో నీళ్లతో ఉన్న కుండకి రంధ్రం ఎందుకు పెడతారు?
Funeral : హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు, ఇతర మత సంప్రదాయంలో కూడా మనిషి చివరి జర్నీ పలు రకాల పద్దతులలో ఉంటుంది. అయితే హిందూ సంప్రదాయంలో మనిషి చనిపోయాక చివరి సారి చేసే కార్యక్రమాలను అంత్యక్రియలు అంటారు. అయితే ఆ చివరి తంతులో కాష్టం చుట్టూ అగ్గి పెట్టె వ్యక్తి భుజం పై ఒక కుండ పెట్టి ఆ కుండలో నీళ్లు పోసి చితి చుట్టూ మూడు సార్లు తిరుగుతూ ఉంటాడు.

Funeral : అంత్యక్రియల సమయంలో నీళ్లతో ఉన్న కుండకి రంధ్రం ఎందుకు పెడతారు?
Funeral ఇది కారణం..
అయితే తిరిగే ప్రతిసారి కుండకు ఒక్కో రంధ్రం పెట్టడం చివరికి ఆ కుండను పగలగొట్టం అందరికి తెలిసిన విషయమే.. కానీ ఇప్పటికి అలా ఎందుకు చేస్తారు అనే విషయంలో మాత్రం దాదాపు ఎవరికీ అసలు విషయం తెలియదు. వాస్తవానికి మనిషి శరీరం ఆత్మ రెండు వేరు అనేది శాస్త్రాలు చెప్తాయి.కుండ శరీరం లాంటిది. అందులో ఉన్న నీరు ఆత్మ లాంటిది కుండకు పెట్టిన రంద్రం నుండి నీరు ఎలా అయితే వెళ్లి పోతుందో శరీరం నుండి కూడా ఆత్మ అలానే వెళ్ళిపోతుంది.
ఇక కుండను పగలగొడతాం అంటే శరీరాన్ని కాల్చేస్తాం. ఇంకా నీకు శరీరం లేదు వెళ్ళిపో అని ఆత్మకు మనము ఇచ్చే సంకేతం ఇచ్చినట్టు అని చెబుతారు . పెద్దలు హిందూ సాంప్రదాయం ప్రకారం చేసే ప్రతి పనిలో ఒక అర్ధం ఉంటుంది. కలియుగ ధర్మం ప్రకారం, మనిషి జీవితకాలం 120 ఏళ్లు. కానీ ఈ రోజుల్లో అది 60 కి చేరిపోయింది