Funeral : అంత్యక్రియలకు డబ్బు లేక తండ్రి శవాన్ని పొదల్లో పడేసిన కొడుకు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Funeral : అంత్యక్రియలకు డబ్బు లేక తండ్రి శవాన్ని పొదల్లో పడేసిన కొడుకు..!!

Funeral : ప్రస్తుత సమాజంలో మానవత్వం ఉన్న కొద్ది తగ్గిపోతుంది. కుటుంబంలో కూడా రక్తసంబంధాల మధ్య బంధాలు నానాటికి దిగజారిపోతున్నాయి. డబ్బు ఇంకా ఆస్తికోసం తోబుట్టువులను చంపే పరిస్థితి కనిపిస్తుంది. వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులను వదిలేస్తున్న పిల్లలు ఎక్కువైపోతున్నారు. సరిగ్గా ఈ  తరహాల్లోనే మరీ చాలా దారుణమైన సంఘటన వైయస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. దువ్వూరు మండలం సింగనపల్లేకు చెందిన చిన్న పుల్లారెడ్డి అనే 62 ఏళ్ల పెద్దాయన… తన కుమారుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి జీవించేవాడు. […]

 Authored By sekhar | The Telugu News | Updated on :5 May 2023,10:00 am

Funeral : ప్రస్తుత సమాజంలో మానవత్వం ఉన్న కొద్ది తగ్గిపోతుంది. కుటుంబంలో కూడా రక్తసంబంధాల మధ్య బంధాలు నానాటికి దిగజారిపోతున్నాయి. డబ్బు ఇంకా ఆస్తికోసం తోబుట్టువులను చంపే పరిస్థితి కనిపిస్తుంది. వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులను వదిలేస్తున్న పిల్లలు ఎక్కువైపోతున్నారు. సరిగ్గా ఈ  తరహాల్లోనే మరీ చాలా దారుణమైన సంఘటన వైయస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. దువ్వూరు మండలం సింగనపల్లేకు చెందిన చిన్న పుల్లారెడ్డి అనే 62 ఏళ్ల పెద్దాయన… తన కుమారుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి జీవించేవాడు. ఈ రాజశేఖర్ రెడ్డి ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిన్న పుల్లారెడ్డికి టీబీ ఎటాక్ అయ్యింది.

దీంతో కొడుకు రాజశేఖర్ రెడ్డి గ్రామంలో ఇచ్చిన చికిత్స సరిగ్గా పని చేయకపోవడంతో కడప ప్రభుత్వ ఆసుపత్రిలో తండ్రిని జాయిన్ చేయడం జరిగింది. ఒక రెండు మూడు రోజులపాటు ఆసుపత్రికి వచ్చి తండ్రిని చూసిన రాజశేఖర్ రెడ్డి.. ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్ళటమే మానుకున్నాడు. హాస్పిటల్ సిబ్బంది ఫోన్ చేసిన.. లిఫ్ట్ చేసేవాడు కాదు. చిన్న పుల్లారెడ్డి పరిస్థితి మరి విషమించటంతో చివరి నిమిషంలో కొడుకుని చూడాలని కోరాటంతో ఆసుపత్రి సిబ్బంది… గ్రామంకి వెళ్లి రాజశేఖర్ రెడ్డిని.. హాస్పిటల్ కి వచ్చేలా చేశారు. చివరి నిమిషంలో కొడుకుని చూసి కొన్ని  నిమిషాలకు పుల్లారెడ్డి మరణించడం జరిగింది. దీంతో తండ్రి శవాన్ని ఒక ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లిన రాజశేఖర్ రెడ్డి.. మార్గమధ్యలోనే… వేరే వాహనం వస్తుందని ఆటో డ్రైవర్ కి చెప్పి మృతదేహాన్ని దింపేయడం జరిగింది. ఆ తర్వాత ఆటో డ్రైవర్ వెళ్లిపోయిన వెంటనే…

తండ్రి మృతదేహాన్ని ఎవరు లేని… సమయంలో తుప్పల్లో విసిరి వేయడం జరిగింది. కొన్ని రోజులకు దుర్వాసన రావడంతో ప్రజలు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శవం పై హాస్పిటల్ లోగో గుర్తించడంతో విషయం మొత్తం మీడియాలో వైరల్ కావటంతో.. వెంటనే రాజశేఖర్ రెడ్డి పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. డబ్బులు లేక ఈ రకంగా తండ్రి శవాన్ని తుప్పలలోకి విసిరేసినట్లు..తప్పు ఒప్పుకున్నాడు. చికిత్స అందించడానికి ఇంకా అంత్యక్రియలకు కూడా పేదరికం అడ్డు రావడం వల్ల ఈ రకంగా వ్యవహరించాల్సి వచ్చిందని.. తండ్రి మృతదేహాన్ని తుప్పలలోకి గెంటేసినట్లు పోలీసుల వద్ద రాజశేఖర్ రెడ్డి తన బాధ చెప్పుకున్నాడు. అయితే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద తల్లిదండ్రులను చూసుకోకపోయినా ఈ రకంగా వ్యవహరించిన వదిలేది లేదని రాజశేఖర్ రెడ్డి పై చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది