Akshaya Tritiya : అక్షయ తృతీయ కు ఎందుకు ప్రాధాన్యం ఇస్తారు… దాని విశిష్టత‌ ?

Akshaya tritiya :  అక్షయ తృతీయకు హిందువులు చాలా ప్రాధాన్యం ఇస్తారు. అయితే దీనివెనుకు పురాణ విశేషాలు ఏమున్నాయి అనేది తెలుసుకుందాం… హిందూ పురాణాల ప్రకారం త్రేతా యుగం అక్షయ తృతీయ రోజున ప్రారంభమైంది. అక్షయ తృతీయ, పరశురామ జయంతి పుట్టినరోజు (విష్ణువు 6 వ అవతారం) ఒకే విధంగా వస్తుంది. అయితే, కొన్నిసార్లు తిథిని బట్టి పరశురామ జయంతి అక్షయ తృతీయ రోజుకు ఒక రోజు ముందు పడవచ్చు. సూర్య చంద్రులు అత్యంత ప్రకాశంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుందని పండితులు అంటున్నారు. వైశాఖ శుద్ధ తదియ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది కాబట్టి ఎంతో విశిష్టమైంది.

History of akshaya tritiya

ఏం చేయాలి ?

ఈ రోజు దానం చేస్తే గ్రహ దోషాలు, పూర్వకర్మ ఫలితాల తొలగిపోతాయి. శ్రీమహావిష్ణువును చందనంతో పూజిస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది. అక్షయ తృతీయ రోజున జపం,హోమం, పితృ తర్పణం, దానం అక్షయ ఫలితం లభిస్తుంది.

ఏం దానం చేయాలి ?

వేసవి తాపాన్ని తగ్గించే విసనకర్ర, గొడుగు, పాదరక్షలతో పాటు దశ దానాలు కూడాశక్తి కొలది చేయవచ్చు. అలాగే ఈ రోజు ఏ పూజ చేసినా అధిక ఫలాన్ని ఇస్తుంది. పితృ తర్పణం చేస్తే పితృలకు అక్షయ పుణ్య ఫలాలు లభిస్తాయి.
ఎవరి శక్తిని అనుసరించి వారు దానం చేస్తే వారికి మంచి ఫలితాలు వస్తాయి. శుభం జరుగుతుంది.

అక్షయ తృతీయ నాడు శుభ సమయం ఇదే !

అక్షయ తృతీయ అంటే పవిత్రమైన దినంగా హిందువులు, జైనులు భావిస్తారు. ఈ రోజును అత్యంత పవిత్రంగా భావించి దానధర్మాదులు, యజ్ఞయాగాదులు, బంగారం వంటి విశేషమైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజున ఏ సమయం మంచిది తదియ తిథి విశేషాలు తెలుసుకుందాం…

History of akshaya tritiya

సాధారణ క్యాలెండర్‌ ప్రకారం అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది. ఈసారి అక్షయ తృతీయ 2021 మే 14 న వచ్చింది. తృతీయ తిథి 2021 మే 14 న 05:38 గంటలకు ప్రారంభమై 2021 మే 15 న 07:59 గంటలకు ముగుస్తుంది.

అక్షయ తృతీయ పూజ ముహూర్తం- ఉదయం 05:38 నుండి 12:18 వరకు (వ్యవధి: 06 గంటలు 40 నిమిషాలు) ఉంది.
బంగారం కొనుగోలు చేయాల్సిన సమయం

అక్షయ తృతీయ బంగారు కొనుగోలు చేయడానికి శుభసమయం 05:38 మే 14, 2021 నుండి మే 15, 05:30 వరకు. (వ్యవధి: 23 గంటలు 52 నిమిషాలు)
చోఘడియా సమయం: ఉదయం ముహూర్తం (చారా, లాభా, అమృత): 05:38 నుండి 10:36 వరకు
మధ్యాహ్నం ముహూర్తం (చారా): 17:23 నుండి 19:04 వరకు
మధ్యాహ్నం ముహూర్తం (శుభ): 12:18 నుండి 13:59 వరకు
రాత్రి ముహూర్తం (లాభా): 21:41 నుండి 22:59 వరకు
రాత్రి ముహూర్తం (శుభ, అమృత, చరా): 00:17 నుండి 04:12, మే 15

Recent Posts

Vijaywada | 5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు

Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…

2 hours ago

AP Free Bus Scheme | ఏసీ బ‌స్సుల్లోను ఫ్రీగా ప్ర‌యాణించే ఛాన్స్.. కీలక ప్రకటన చేసిన ఆర్టీసీ ఎండీ

AP Free Bus Scheme |  ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…

3 hours ago

Telangana IPS Transfers | తెలంగాణలో భారీ ఐపీఎస్ బదిలీలు .. ప్రభుత్వ పరిపాలనలో కొత్త అడుగులు…

Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…

5 hours ago

Allu Family | అల్లు వారింట పెళ్లి సంద‌డి.. శిరీష్ పెళ్లి చేసుకోబోయే యువ‌తి ఎవ‌రంటే..!

Allu Family | మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…

6 hours ago

Eye Care Tips | స్వీట్స్ ఎక్కువ తింటున్నారా.. కంటి చూపు పోయే ప్రమాదం..!

Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…

7 hours ago

Ramen noodles | రామెన్ నూడుల్స్ అధిక వినియోగం..మరణ ప్రమాదం 1.5 రెట్లు పెరుగుదల

Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…

8 hours ago

Lungs | ప్రజలకు హెచ్చరిక.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయోద్దు..!

Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…

9 hours ago

Sabudana | నవరాత్రి ఉపవాసంలో సబుదాన ఎక్కువ తినొద్దు ..నిపుణుల హెచ్చరిక

Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…

10 hours ago