History of Sri Laxmi Narasimha Swamy Dharmapuri Temple
రాక్షసుడైన హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి అతనిని మెప్పించాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ హిరణ్యకశిపుని ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.. ఇంకేముంది. క్రూరుడైన రాక్షసునికి బ్రహ్మ అండదండలు లభించాయి. తనకు మరణం ఉండకూడని విధంగా వరం కోరాడు. బ్రహ్మ ఈ కోరికకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే తనకు దేవతలతో, మానవులతో, మృగాలతో, ఆయుధాలతో, పగటి వేళ, రాత్రివేళ, ఇంట్లో, బయటా భూమిపై, ఆకాశంలో మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు. గత్యంతరం లేకుండా బ్రహ్మ వరం ప్రసాదించి వెళ్ళాడు. అసలే రాక్షసుడు. పైగా బలవంతుడు. ఇప్పుడు మరణం లేకుండా వరం పొందినవాడు. దీనితో హిరణ్యకశిపుడు విజృంభించాడు. అదుపు లేక పోయాడు. ముల్లోకాలపై ఆధిపత్యం ప్రకటించాడు.. దేవతలను, మానవాళిని వేధింపసాగాడు. హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. బాల్యంలోనే భాగవతుడైనాడు. ఇది తండ్రికి నచ్చలేదు. విష్ణుభక్తిని మానుకోవాలని నచ్చచెప్పాడు, ఫలితం లేకపోగా, చివరకు ప్రహ్లాదుని చంపడానికి కూడా వెనుకాడలేదు. దేవతలు విష్ణువుకు తమ గోడు విన్నవించుకొన్నారు. హిరణ్యకశిపునకు అంతం వచ్చింది. అతనికి పగలు, రాత్రి, ఆయుధాలతో, మానవులతో, మృగాలతో మరణం లేదు కాబట్టి విష్ణువు సాయం సంధ్య వేళ, సగం మానవుడు సగం సింహం స్వరూపుడైన నరసింహావతారంతో, స్థంభం నుండి వెలువడి, గడప వరకు లాగుకొని వెళ్లి గడపపై తన ఒడిలో వేసుకొని గోళ్లతో చీల్చి సంహరించాడు. హిరణ్యకశిపుడు భూమిపై, ఆకాశంలో మరణం లేకుండా వరం పొందిన కారణంగా విష్ణువు అతడిని ఒడిలో వేసుకొని చంపవలసి వచ్చింది.
History of Sri Laxmi Narasimha Swamy Dharmapuri Temple
హిరణ్యకశిపుని సంహారం తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చాడు. శాంతించాలని దేవతలు స్వామిని ప్రార్థించారు. శాంతించిన నరసింహుడు ధర్మపురి చేరుకొని అక్కడ యోగముద్రతో ధ్యానం చేశాడని ఇతిహాసాలలో పేర్కొన్నాయి.
ధర్మపురి ఆలయంలో శివుడు రామలింగేశ్వరుడుగా వెలిశాడు. దీనితో ధర్మపురి హరి హర క్షేత్రమైనది. ఈ క్షేత్రంలో గోదావరి నది బ్రహ్మగుండం, సత్యవతి గుండం, పాలగుండం, చక్రగుండంగా ప్రవహిస్తున్నది.
ధర్మపురి రాజు ధర్మవర్మ నరసింహునికి ఆలయం Laxmi Narasimha Swamy కట్టించాడు. దీనితో పట్టణానికి ధర్మపురి అని పేరు వచ్చింది. ఈ క్షేత్రం క్రీ.పూ. 850 సంవత్సరంలోనే ఉండిందని ఆలయ శాసనాలు పేర్కొంటున్నాయి. 1422- 36 మధ్య బహుమని సుల్తానులు ఆలయాన్ని ధ్వంసం చేశారని, 17 వ శతాబ్దంలో ఆలయ పునర్నిర్మాణం జరిగిందని తెలుస్తుంది. ధర్మపురి ఫోటులు వాడగలరు
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.