History of Sri Laxmi Narasimha Swamy Dharmapuri Temple
రాక్షసుడైన హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి అతనిని మెప్పించాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ హిరణ్యకశిపుని ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.. ఇంకేముంది. క్రూరుడైన రాక్షసునికి బ్రహ్మ అండదండలు లభించాయి. తనకు మరణం ఉండకూడని విధంగా వరం కోరాడు. బ్రహ్మ ఈ కోరికకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే తనకు దేవతలతో, మానవులతో, మృగాలతో, ఆయుధాలతో, పగటి వేళ, రాత్రివేళ, ఇంట్లో, బయటా భూమిపై, ఆకాశంలో మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు. గత్యంతరం లేకుండా బ్రహ్మ వరం ప్రసాదించి వెళ్ళాడు. అసలే రాక్షసుడు. పైగా బలవంతుడు. ఇప్పుడు మరణం లేకుండా వరం పొందినవాడు. దీనితో హిరణ్యకశిపుడు విజృంభించాడు. అదుపు లేక పోయాడు. ముల్లోకాలపై ఆధిపత్యం ప్రకటించాడు.. దేవతలను, మానవాళిని వేధింపసాగాడు. హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. బాల్యంలోనే భాగవతుడైనాడు. ఇది తండ్రికి నచ్చలేదు. విష్ణుభక్తిని మానుకోవాలని నచ్చచెప్పాడు, ఫలితం లేకపోగా, చివరకు ప్రహ్లాదుని చంపడానికి కూడా వెనుకాడలేదు. దేవతలు విష్ణువుకు తమ గోడు విన్నవించుకొన్నారు. హిరణ్యకశిపునకు అంతం వచ్చింది. అతనికి పగలు, రాత్రి, ఆయుధాలతో, మానవులతో, మృగాలతో మరణం లేదు కాబట్టి విష్ణువు సాయం సంధ్య వేళ, సగం మానవుడు సగం సింహం స్వరూపుడైన నరసింహావతారంతో, స్థంభం నుండి వెలువడి, గడప వరకు లాగుకొని వెళ్లి గడపపై తన ఒడిలో వేసుకొని గోళ్లతో చీల్చి సంహరించాడు. హిరణ్యకశిపుడు భూమిపై, ఆకాశంలో మరణం లేకుండా వరం పొందిన కారణంగా విష్ణువు అతడిని ఒడిలో వేసుకొని చంపవలసి వచ్చింది.
History of Sri Laxmi Narasimha Swamy Dharmapuri Temple
హిరణ్యకశిపుని సంహారం తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చాడు. శాంతించాలని దేవతలు స్వామిని ప్రార్థించారు. శాంతించిన నరసింహుడు ధర్మపురి చేరుకొని అక్కడ యోగముద్రతో ధ్యానం చేశాడని ఇతిహాసాలలో పేర్కొన్నాయి.
ధర్మపురి ఆలయంలో శివుడు రామలింగేశ్వరుడుగా వెలిశాడు. దీనితో ధర్మపురి హరి హర క్షేత్రమైనది. ఈ క్షేత్రంలో గోదావరి నది బ్రహ్మగుండం, సత్యవతి గుండం, పాలగుండం, చక్రగుండంగా ప్రవహిస్తున్నది.
ధర్మపురి రాజు ధర్మవర్మ నరసింహునికి ఆలయం Laxmi Narasimha Swamy కట్టించాడు. దీనితో పట్టణానికి ధర్మపురి అని పేరు వచ్చింది. ఈ క్షేత్రం క్రీ.పూ. 850 సంవత్సరంలోనే ఉండిందని ఆలయ శాసనాలు పేర్కొంటున్నాయి. 1422- 36 మధ్య బహుమని సుల్తానులు ఆలయాన్ని ధ్వంసం చేశారని, 17 వ శతాబ్దంలో ఆలయ పునర్నిర్మాణం జరిగిందని తెలుస్తుంది. ధర్మపురి ఫోటులు వాడగలరు
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
This website uses cookies.