Diwali : దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగిస్తే మంచిది... శాస్త్రం ఏం చెబుతుందంటే....!
Diwali : హిందూ మతంలో దీపావళి పండుగను ఆశ్వీయుజ అమావాస్య రోజున రాత్రి చిమ్మ చీకట్లలో వెలుగులు నింపుతూ దీపాలను వెలిగిస్తారు. అయితే ఈ పండుగ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. నువ్వుల నూనె వేసి వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని నమ్ముతారు. ప్రస్తుతం కొంతమంది దీపాలకు బదులుగా కొవ్వొత్తులను ,విద్యుత్ దీపాలను వెలిగిస్తున్నారు. అయితే ఇలా ఇంటి ముందు వెలిగిస్తే సరిపోతుంది. కానీ ఇంటి గుమ్మం మరియు తులసి చెట్టు దగ్గర మాత్రం మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి వెలిగించిన దీపాలను పెట్టాలి. అయితే దీపావళి పండుగ రోజున ప్రదోష సమయంలో లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఇక ఈరోజున ధనలక్ష్మికి పూజ చేస్తే ధన ధాన్యాలు సంపద కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు. దీపం జ్ఞానానికి సంపద ఐశ్వర్యం ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపాలను పెట్టుకుంటే అమ్మ అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది. శాస్త్రం ప్రకారం దీపావళిలో దీపా అంటే దీపం అని… ఇక అవలి అంటే వరస అని అర్థం. కాబట్టి దీపావళి అంటే ఇంటి ముందు నువ్వుల నూనెతో దీపాలను వరుసగా వెలుగుతాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్మకం. అలాగే దీపావళి పండుగరోజు సాయంత్రం లక్ష్మి దేవిని పూజించుకొని తులసి కోట దగ్గర స్త్రీలు దీపాలను వెలిగించుకోవాలి. మీరు పెట్టే దీపంలో సకల దేవతలు వేదాలు ఉంటారని నమ్ముతూ శాంతి క్రాంతికి గుర్తుగా దీపాలను వెలిగించాలి…
దీపావళి రోజున వెలిగించే దీపాలను ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మంచిది. అయితే మొదటి దీపంలో వేప నూనె రెండు చుక్కలు, ఆవునెయ్యి కలిపిన దీపాన్ని పరమ శివుని ముందు వెలిగించడం ద్వారా విజయం ప్రాప్తిస్తుంది. దీపాలను నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఒక దీపాన్ని అగరబత్తితో వెలిగించి ఆ దీపంతో మరొక దీపానికి వెలిగించుకుంటూ దీపారాధన చేయాలి. ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి ఉండడం వలన ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. అయితే శాస్త్రం ప్రకారం దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి ఆ ఇంటి ఇల్లాలు స్వయంగా వెలిగించాలి.
Diwali : దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగిస్తే మంచిది… శాస్త్రం ఏం చెబుతుందంటే….!
మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధి కోసం వెలిగించాలి. ఇక అర్ధనారీశ్వరునికి దీపారాధన చెయ్యాలి అనుకునేవారు కొబ్బరి నూనె ఉపయోగించడం మంచిది. దీని వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. అదేవిధంగా విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనెను ఉపయోగించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అయితే చాలామంది దీపాలలో నువ్వుల నూనెలకు బదులుగా వేరుశనగ నూనెను ఉపయోగిస్తారు. కానీ ఇలా చేయకూడదు ఎందుకంటే నూవ్వుల నూనె సకల దేవతలకు ఇష్టం. కాబట్టి నువ్వుల నూనెతో వెలిగించే దీపాలు దుష్పలితాలను దూరం చేసి సకలశుభాలను ఇస్తుంది. కనుక దీపారాధనలో పొరపాటున కూడా వేరుశనగ నూనెను ఉపయోగించకూడదు.
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.