
Maha Shivratri : మహాశివరాత్రి నాడు శివుడికి ఇవి సమర్పించండి చాలు.. అఖండ ధన లాభం మీ సొంతం..!
Maha Shivratri : మన సనాతన ధర్మంలో మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ సంవత్సరం శివరాత్రి మార్చి 8న వచ్చింది. శివుడు పార్వతిని పెళ్లాడింది ఈరోజు అని నమ్ముతారు. శివరాత్రి రోజు ఉపవాసం, పూజ, జాగారానికి ఎంతో విశిష్టత ఉంది. శివుడి అనుగ్రహం కోసం మహాశివరాత్రి రోజు భక్తులు ఎంతో విశేషంగా పూజిస్తుంటారు. అయితే ఈ మహాశివరాత్రి రోజున కొన్ని పుష్పాలు శివుడికి పూజ చేయడం మంచిది. శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ పూలు సమర్పించడం వలన శివుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇక హైందవ ధర్మంలో మల్లె పువ్వులు ప్రేమకు స్వేచ్ఛకు చిహ్నంగా భావిస్తారుష ముఖ్యంగా వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు శివుడికి మల్లెపూలను సమర్పిస్తే కోరిక నెరవేరుతుంది. ఎన్నో రోజులుగా చేయాలనుకుంటున్నా పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి. అలాగే అవిసె పూలు కూడా సమర్పించడం వలన శివుడి ఆశీస్సులు లభిస్తాయి.
ఈ సమయంలో విష్ణు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఇక శమీ పూలు కూడా మహాశివరాత్రి నాడు శివుడికి సమర్పిస్తే ఎంతో మంచి జరుగుతుంది. శని దేవుడు దయ కూడా లభిస్తుంది. ఆర్థిక సంక్షోభం, ఆహార సమస్యలు ఎదుర్కొంటున్న వారు మహాశివరాత్రి నాడు జోహి పూలను సమర్పించాలి. ఈ పూలతో బోలా శంకరుడిని పూజిస్తే వారికి ఎలాంటి డబ్బు కొరత ఉండదు. ఇక శివుడికి ఎరుపు రంగు తెలుపు రంగు పూలు అంటే ఎంతో ఇష్టం. మందార పూలతో కనుక శివుడిని పూజిస్తే మోక్షం లభిస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. ఇక శివుడికి అత్యంత ప్రీతికరమైన పువ్వులలో ఒకటి ఉమ్మెత్త. ఇది లేకుండా శివుడిని ఆరాధిస్తే ఆ పూజ అసంపూర్ణమవుతుంది అంటారు. శివలింగంపై ఉమ్మెత్త పువ్వులు పెట్టడం వలన వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి.
ఇక శివరాత్రి నాడు శివుడికి గులాబీ పూలతో పూజ చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఇక శ్రేయస్సు శాంతికి చిహ్నంగా భావించే తామర పువ్వులు కూడా శివుడికి సమర్పించవచ్చు. పూజలో సమర్పించడం వలన మోక్షం లభిస్తుంది. ఇక శివుడికి అత్యంత ప్రీతికరమైన పువ్వులలో ఒకటి జిల్లేడు పూలు. మహాశివరాత్రి రోజు శివుడిని తెల్లజిల్లేడు పువ్వులతో ఆరాధిస్తే మానసికం,గా శారీరకంగా చేసిన పాపాలు తొలగిపోతాయని అంటారు. ఇక మహాశివరాత్రి నాడు శివుడికి నైవేద్యంగా బెల్లం తో కూడిన నైవేద్యాలను సమర్పిస్తే పరమశివుడు ఎంతో సంతోషిస్తాడని అంటారు. అలాగే నైవేద్యంగా కొబ్బరికాయ ముక్కలు కూడా పెట్టవచ్చు. అలాగే ఎండు ద్రాక్ష, అరటి పండ్లు, ఖర్జూరాలు కూడా శివుడికి పెట్టవచ్చు. ఈ నైవేద్యాలు శివుడికి సమర్పించడం వలన సకల సౌభాగ్యాలు లభిస్తాయని నమ్మకం.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విశ్లేషిస్తే వైసీపీ అధినేత జగన్…
Dacoit Movie : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన కెరీర్ లో ఎప్పుడు వైవిధ్యమైన కథలను…
Raghuraama Vs Ramalayam : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రస్తుతం ఒక ఆలయ నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…
Chanakyaniti : సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
This website uses cookies.