Karthika Masam : కార్తీక శుక్రవారం రోజున ఇలా చేశారంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది!

Advertisement
Advertisement

Karthika Masam : అన్ని మాసాలలో కార్తీకమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే కార్తీకమాసంలో వచ్చే శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సంవత్సరం ఈ పవిత్రమైన రోజున కార్తీక శుక్రవారం రోజునే దేవ ప్రబోధిని ఏకాదశి రావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తిధి రోజే శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మెలకువలోకి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కార్తీక శుక్రవారం రోజున విష్ణువుతోపాటు లక్ష్మీదేవి, పార్వతి దేవిలను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే సిరిసంపదలు కూడా పెరుగుతాయి. కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్మకం. అందుకే కార్తిక శుక్రవారం పూట కొన్ని పనులను కచ్చితంగా చేయాలి. అలా చేయడం వలన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

Advertisement

కార్తీక శుక్రవారం పూట సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించి ఉతికిన బట్టలను ధరించాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉన్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఉపవాసం ఉన్నవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. మిగిలిన రెండు పూటలు పండ్లు, పండ్ల రసాలు, కొబ్బరితో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే కార్తీక శుక్రవారం రోజున స్త్రీలు తెలుపు రంగులో ఉండే పూలను కనకాంబరాలను గాని ధరించి లక్ష్మీదేవి, పార్వతి దేవిలను పూజిస్తే దీర్ఘసుమంగళిగా జీవిస్తారు. ఇదే రోజున సాయంత్రం అంటే సంధ్యా వేళలో ఇంట్లో దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవిని మన ఇంటికి పిలిచినట్లే. ధనలక్ష్మి ఇంట్లోకి వచ్చి నివాసం ఉంటుందని చాలా మంది నమ్మకం.

Advertisement

Karthika Masam do these on Karthika shukravaram get lakshmi kataksham

కార్తీక శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ఎదుట దీపారాధన చేస్తే సిరిసంపదలు పెరుగుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసి చెట్టు ముందు దీపాలను వెలిగించాలి. అన్ని దీపాలను మట్టితో తయారు చేసినవే అయి ఉండాలి. అలాగే ప్రమిదలలో నెయ్యి వేసి దీపాలను వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎవరి ఇంటి ముందు అయితే శుక్రవారం పూట సంధ్యా వేళలో దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి ధనలక్ష్మి వస్తుందని చాలామంది నమ్ముతున్నారు. ఇదే రోజున లక్ష్మీదేవి పార్వతి దేవి దేవాలయాలకు వెళ్లి దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది. అమ్మవారికి మల్లెపూలు లేదా పూలమాలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి జ్యోతిష్యులు చెబుతున్నారు.

Advertisement

Recent Posts

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

47 minutes ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

2 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

4 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

4 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

8 hours ago

AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్ 2026-27 హైలైట్స్ ! ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..!!

AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…

8 hours ago

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ ఫ్యామిలీ కి షాక్ ఇచ్చిన ఓటర్లు

TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సూర్యాపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడమే కాకుండా,…

9 hours ago