తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడికి మొదటి నైవేద్యం అందులోనే పెట్ట‌డం వెనుక ర‌హ‌స్యం..?

Advertisement
Published by
Advertisement

తిరుమల.. శ్రీవేంకటేశ్వరస్వామి, కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రం ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన క్షేత్రంగా, ఆదాయం వచ్చే క్షేత్రంగా ఖ్యాతిగడించింది. అయితే నిజంగా శ్రీవేంకటేశ్వరుడు కేవలం ధనవంతుల దేవుడేనా? అనిపిస్తుంది. అయితే దీనివెనుక కథను నేటికి నిత్యం తిరుమలలో జరిగే విశేషాలను తెలుసుకుందాం.. తిరుమల ఆలయం నిర్మించిన తొండమాన్‌ చక్రవర్తి …స్వామికి నిత్యం బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట – “స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి?” అన్నాడుట. స్వామి తొండమానుడుకి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నాడు. అతని పేరు భీముడు. ఒక కుమ్మరివాడు వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి. మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట.

Advertisement

వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి క‌ల‌వాలి

అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట. ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట. అప్పుడు ఆ భీముడే, తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెళ్ళాడుట. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, “ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం” అని.భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు.కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు. అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు  వాటి వల్ల నా సంసారం సాగుతోంది. నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట.

Advertisement

lord venkateswara swamy Naivedyam secrets

ఏ పని మొదలుపెట్టినా “గోవింద” నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి” అనేవాడుట? అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట,వీడేమో అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు, నేనేమో నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను. ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం. భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట. స్వామి వారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానంలోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారట.

అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్ని భీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు. నేటికి తిరుమలలో ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. స్వామి ప్రధాన గర్భగుడిలో పెట్టే మొదటి నైవేద్యం కుండపెంకులోనే. స్వామి తనను ఆరాధించిన వాడికి సొంతం. భక్తికి ఆయన పరవశుడైపోతాడు. అంతేకానీ ధనం ఇస్తే కోట్లాది రూపాయలకు, వజ్రవైఢూర్యాలకు లొండడు అనేది తెలుసుకోవాలి.

Advertisement

Recent Posts

Revanth Reddy : శభాష్ రేవంత్ , రాష్ట్రం మొత్తం మెచ్చుకునే నిర్ణయం తీసుకున్న CM..!

Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…

41 minutes ago

Vijay : హీరో విజయ్‌కి భారీ షాక్ … విడాకులు కోరిన భార్య సంగీత

Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…

1 hour ago

Jagadish Reddy : నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి బట్టబయలైంది : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…

2 hours ago

Puranapanda Book : హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం..!

Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…

3 hours ago

Actor Sivaji : శివాజీ పై రెచ్చిపోయిన మరొక హీరోయిన్ .. వామ్మో వాయించేసింది

Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…

3 hours ago

YouTuber Naa Anvesh : ప్రభుత్వానికి సవాల్ విసిరిన యూట్యూబర్ నా అన్వేష్ .. వైరల్ వీడియో

YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…

5 hours ago

Uppal : ఉప్పల్‌లో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

Uppal :  Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…

5 hours ago

High Fees : బ్రేకింగ్‌ న్యూస్‌ .. ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు తీపికబురు .. ఫీజుల విషయంలో సీఎం కీలక నిర్ణయం

High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…

6 hours ago

Vijay-Rashmika : ప్రధాని మోదీతో నూతన దంపతులు భేటీ .. రిసెప్షన్‌కు ప్రత్యేక ఆహ్వానం

Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…

7 hours ago

Rinku Singh Father Death: తండ్రి మరణం.. ప్లేయింగ్ 11లో దక్కని చోటు, రింకూ సింగ్ జీవితంలో 4 విషాద రోజులు..!

Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…

7 hours ago

Delhi liquor case : బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ .. లిక్కర్ స్కాం కేసులో చారిత్రాత్మక తీర్పు .. కవితకు ‘క్లీన్ చిట్’, కేజ్రీవాల్‌కు ఊరట

Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…

8 hours ago

Medchal : వృద్ధుడికి 100 ఏళ్లు జన్మదిన వేడుకలు .. ఆలోపే అనుకోని ఘటన

Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…

9 hours ago