Revanth reddy : సాగర్ లో జానారెడ్డి గెలిస్తే… టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికే?

Advertisement
Advertisement

Revanth Reddy : దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం చెందింది. దీంతో టీపీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా సమర్పించారు. దుబ్బాక ఉపఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతికంగా బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. అప్పటి నుంచి కొత్త టీపీసీసీ చీఫ్ పదవి కోసం రేసు ప్రారంభం అయింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్.. తెలంగాణకు వచ్చి… తదుపరి టీపీసీసీ చీఫ్ గా ఎవరైతే బాగుంటుందని ఆయన తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతల అభిప్రాయం తీసుకున్నారు. అయితే.. టీపీసీసీ చీఫ్ రేసులో చాలామంది పేర్లే వినిపించినా… ఎక్కువగా వినిపించిన పేరు మాత్రం రేవంత్ రెడ్డిదే.

Advertisement

will revanth reddy become tpcc chief if jana reddy wins

అవును… తెలంగాణ ఫైర్ బ్రాండ్ అంటే రేవంత్ రెడ్డి. అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించాలన్నా… వాళ్ల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలన్నా… కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తర్వాతనే ఎవ్వరైనా. అందుకే… రేవంత్ రెడ్డి పేరును అధిష్ఠానం కూడా పరిగణనలోకి తీసుకుంది. కానీ… రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు అడ్డు చెప్పారని… అందుకే టీపీసీసీ చీఫ్ నియామకాన్ని కొన్ని రోజులకు హైకమాండ్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

Advertisement

అయితే.. తాజాగా మళ్లీ టీపీసీసీ చీఫ్ రేసు మొదలైనట్టు తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఉపఎన్నికల ఫలితాల తర్వాత టీపీసీసీ చీఫ్ ను నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. సాగర్ ఉపఎన్నిక ప్రచార సమయంలోనే మాణిక్యం ఠాగూర్… టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ వేగవంతం అవుతోందని… సాగర్ ఉపఎన్నిక ఫలితాల తర్వాత ఉంటుందని ఆయన పార్టీ నేతలకు చెప్పడంతో…. మళ్లీ టీపీసీసీ చీఫ్ రేసులో ఎవరుంటారు అనే దానిపై మళ్లీ సందిగ్ధత నెలకొన్నది.

Revanth Reddy : సాగర్ ఉపఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు టీపీసీసీ చీఫ్ నియామకాన్ని వాయిదా వేయాలన్న జానారెడ్డి

నిజానికి… సాగర్ ఉపఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను వాయిదా వేయాలని జానారెడ్డి హైకమాండ్ ను కోరారట. అందుకే… అధిష్ఠానం ఆ ప్రక్రియను వాయిదా వేసిందట. సాగర్ ఉపఎన్నిక ముగియడంతో… మే 2 న ఫలితాలు కూడా వెలువడనున్నాయి. అందుకే… ఇక టీపీసీసీ చీఫ్ పదవి ఎంపిక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి… కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని హైకమాండ్ ఆలోచిస్తోంది.

అయితే… రేవంత్ రెడ్డితో పాటు… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి కూడా టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటి పడుతున్నా… ఒకవేళ జానారెడ్డి సాగర్ ఉపఎన్నికల్లో గెలిస్తే… రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే… సాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను రేవంత్ రెడ్డి భుజాన వేసుకున్నారు. ఒకవేళ అక్కడ జానారెడ్డి గెలిస్తే… ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికే దక్కుతుంది. అందుకే.. జానారెడ్డి కూడా రేవంత్ రెడ్డికే ఓకే చెబుతారని తెలుస్తోంది. అంటే.. జానారెడ్డి సాగర్ ఉపఎన్నికల్లో గెలిస్తే… ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయినట్టే లెక్క.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

3 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.