Makara Rasi Phalalu : రేపటినుండి 2036 వరకు మకర రాశి వారి జీవితంలో పెనుమార్పులు…!

Authored By Jyothi Marikanti | The Telugu News | Published on: November 24, 2023, 7:00 am
  •  Makara Rasi Phalalu : రేపటినుండి 2036 వరకు మకర రాశి వారి జీవితంలో పెనుమార్పులు...!

Makara Rasi Phalalu : రేపటినుండి 2036 వరకు మకర రాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు జరగబోతున్నాయి. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతుంది. ఏమిటి ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి వివరంగా తెలుసుకుందాం.. మీరు అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. అంటే వీరు ఏ పని చేసినా ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మారుతున్న గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఎన్నో రకాల ఆర్థిక లాభాలను పొందుతారు. ఒకటి రెండు కాదండి. మీరు తలపెట్టిన లేదా మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో మీ ప్రమయం లేకపోయినప్పటికీ కూడా మీకు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఎవరికోసం మీరు చేసిన సహాయం వలన మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సమయంలో అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధించడంతోపాటు మీరు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారికి సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది.

ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యపరంగా చేసుకున్నట్లయితే ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలను కూడా పూర్తిగా సమస్య పోతాయి. మీ తల్లితండ్రుల అనారోగ్య సమస్యల కారణంగా మీరు మానసికంగా కృంగిపోయి ఉన్నారు. కానీ ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మీ తల్లితండ్రులు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. పని మీద బయటకు వెళ్లేటప్పుడు మీ పూజ మందిరంలో విఘ్నేశ్వరుని పటం దగ్గర రెండు అక్షంతలు వేసి రెండు మీ నెత్తి మీద వేసుకుని బయటికి వెళ్లడం వలన ఆ పనులు వేగవంతంగా పూర్తవుతాయి. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామాలను ప్రతిరోజు పట్టించడం వలన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సోమవారం ఉపవాస నియమాలను పాటిస్తూ పరమేశ్వరుని ప్రార్థించడం వలన సర్వేశ్వరుని కృపను పొందుతారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత కనకధారా స్తోత్రాన్ని పటించడం వలన అపారమైన సిరిసంపదలు కలుగుతాయి.. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చేసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి.

శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో 18 ప్రదక్షిణలు చేసినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు పక్షులకు, మూగ ప్రాణులకు తృణధాన్యాలు గింజలను ఆహారంగా పెట్టడం వలన పుణ్య కర్మలను పొందుతారు. ఈ దీపాన్ని సింహద్వారానికి రెండు వైపులా ఉంచాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంట్లో రోజు కర్పూరాన్ని వెలిగించి అందులో రెండు లవంగాలు వేసినట్లయితే మంచి వాసన వస్తుంది విశేషమైన అదృష్టాన్ని పొందుతారు…

Jyothi Marikanti

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp