
the secret behind giving Theertham three times
Theertham : హిందూ సంప్రదాయాల ప్రకారం హిందువులంతా పండుగలు, పబ్బాలు, ఇష్టమైన వారాల్లోనో లేదా పూజలు, వ్రతాలప్పుడు కచ్చితంగా గుడికి వెళ్తుంటారు. స్వామి వారి అనుగ్రహం పొందేందుకు కొబ్బరి కాయలు కొట్టడం, ప్రసాదాల సమర్పించడం మనకు తెలిసిన విషయమే. అయితే అక్కడ మనకు దేవుడుకి మధ్య అనుసంధాన కర్తగా పనిచేసే పూజారి తీర్థ ప్రసాదాలను అందజేసి మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. అయితే మనం తీర్థం తీసుకునేటప్పుడు పూజారి మూడు సార్లు తీర్థం అందజేస్తారు. ఒకవేళ మనం ఒకసారి వేయగానే చేయి వెనక్కి తీసుకున్నా మూడు సార్లు తీసుకోవాలని పూజారి మనకు చెప్తుంటాడు. అయితే స్వామివారి తీర్థం మూడు సార్లు ఇవ్వడం వెనక గల కారణం ఏమిటి? తీర్థం తీసుకునేటప్పుడు ఎడమ చేతిలో కుడి చేయి పెట్టి తీర్థం ఎందుకు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు పురోహితులు అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర దుర్గావిష్ణు పాదోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్ధాన్ని మూడు సార్లు భక్తులు చేతిలో వేస్తారు. అవి అకాల మరణాన్ని తప్పించే శక్తి, అన్ని రోగాల నివారణ, పాపక్షయం కనుక తీర్థాన్ని స్వీకరించి భక్తుడు స్వచ్ఛమైన మనసుతో దేవునిపై దృష్టి ఉంచి తీర్థాన్ని స్వీకరించాలని వేద పండితులు వివరిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల భక్తులకు శుభ ఫలితాలు కలుగుతాయట. అయితే మూడు సార్లు తీర్థం వేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే… మొదటి సారి తీర్థం తీసుకోవడం వల్ల మానసిక, శారీరక శుద్ధి జరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా రెండవ సారి తీర్థం తీసుకోవడం వల్ల న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయట. అంతే కాకుండా మూడవ సారి తీర్థం స్వీకరించడం వల్ల పరమేశ్వరుడి కృప మనపై ఉంటుందట. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింప చేసేదని అర్థం.
the secret behind giving Theertham three times
కాబట్టి ఆలయాన్ని సందర్శించిన భక్తులు ఈ విధంగా మూడు సార్లు తీర్థం తీసుకోవటం వల్ల భోజనం చేసినంత శక్తిని లభిస్తుందని మన పెద్దలు చెబుతుంటారు.అదే విధంగా తీర్థం తీసుకునే సమయంలో ప్రతి భక్తుడు ఎడమ చేతిలో కుడి చేయి పెట్టుకొని… కుడి చేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని సేవించడం వల్ల కళ్లు, బ్రహ్మ రంధ్రం, తల, మెడను తాకుతాయి. ప్రసాదం అనేది పృథ్వితత్వం అనే అంశంతో ముడిపడి ఉంటుంది. దీని వల్ల చైతన్యం, శక్తి కలుగుతాయి. అదే విధంగా తీర్ధం తీసుకున్న తర్వాత చాలా మంది చేతితో తలపై తాకుతుంటారు. కానీ ఇలా అస్సలే చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే తలలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఎంగిలి చేయితో బ్రహ్మను తాకండ మహా పాపం. అందుకే తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని కళ్ళకు అద్దుకోవడం ఎంతో మంచిదని వివరిస్తున్నారు.
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
This website uses cookies.