Theertham : తీర్థాన్ని మూడు సార్లు ఎందుకు తీసుకుంటారు.. కారణం ఏంటి?

Advertisement
Advertisement

Theertham : హిందూ సంప్రదాయాల ప్రకారం హిందువులంతా పండుగలు, పబ్బాలు, ఇష్టమైన వారాల్లోనో లేదా పూజలు, వ్రతాలప్పుడు కచ్చితంగా గుడికి వెళ్తుంటారు. స్వామి వారి అనుగ్రహం పొందేందుకు కొబ్బరి కాయలు కొట్టడం, ప్రసాదాల సమర్పించడం మనకు తెలిసిన విషయమే. అయితే అక్కడ మనకు దేవుడుకి మధ్య అనుసంధాన కర్తగా పనిచేసే పూజారి తీర్థ ప్రసాదాలను అందజేసి మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. అయితే మనం తీర్థం తీసుకునేటప్పుడు పూజారి మూడు సార్లు తీర్థం అందజేస్తారు. ఒకవేళ మనం ఒకసారి వేయగానే చేయి వెనక్కి తీసుకున్నా మూడు సార్లు తీసుకోవాలని పూజారి మనకు చెప్తుంటాడు. అయితే స్వామివారి తీర్థం మూడు సార్లు ఇవ్వడం వెనక గల కారణం ఏమిటి? తీర్థం తీసుకునేటప్పుడు ఎడమ చేతిలో కుడి చేయి పెట్టి తీర్థం ఎందుకు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు పురోహితులు అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర దుర్గావిష్ణు పాదోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్ధాన్ని మూడు సార్లు భక్తులు చేతిలో వేస్తారు. అవి అకాల మరణాన్ని తప్పించే శక్తి, అన్ని రోగాల నివారణ, పాపక్షయం కనుక తీర్థాన్ని స్వీకరించి భక్తుడు స్వచ్ఛమైన మనసుతో దేవునిపై దృష్టి ఉంచి తీర్థాన్ని స్వీకరించాలని వేద పండితులు వివరిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల భక్తులకు శుభ ఫలితాలు కలుగుతాయట. అయితే మూడు సార్లు తీర్థం వేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే… మొదటి సారి తీర్థం తీసుకోవడం వల్ల మానసిక, శారీరక శుద్ధి జరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా రెండవ సారి తీర్థం తీసుకోవడం వల్ల న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయట. అంతే కాకుండా మూడవ సారి తీర్థం స్వీకరించడం వల్ల పరమేశ్వరుడి కృప మనపై ఉంటుందట. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింప చేసేదని అర్థం.

Advertisement

the secret behind giving Theertham three times

కాబట్టి ఆలయాన్ని సందర్శించిన భక్తులు ఈ విధంగా మూడు సార్లు తీర్థం తీసుకోవటం వల్ల భోజనం చేసినంత శక్తిని లభిస్తుందని మన పెద్దలు చెబుతుంటారు.అదే విధంగా తీర్థం తీసుకునే సమయంలో ప్రతి భక్తుడు ఎడమ చేతిలో కుడి చేయి పెట్టుకొని… కుడి చేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని సేవించడం వల్ల కళ్లు, బ్రహ్మ రంధ్రం, తల, మెడను తాకుతాయి. ప్రసాదం అనేది పృథ్వితత్వం అనే అంశంతో ముడిపడి ఉంటుంది. దీని వల్ల చైతన్యం, శక్తి కలుగుతాయి. అదే విధంగా తీర్ధం తీసుకున్న తర్వాత చాలా మంది చేతితో తలపై తాకుతుంటారు. కానీ ఇలా అస్సలే చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే తలలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఎంగిలి చేయితో బ్రహ్మను తాకండ మహా పాపం. అందుకే తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని కళ్ళకు అద్దుకోవడం ఎంతో మంచిదని వివరిస్తున్నారు.

Advertisement

Recent Posts

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

57 mins ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

3 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

4 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

5 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

6 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

7 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

8 hours ago

This website uses cookies.