the secret behind giving Theertham three times
Theertham : హిందూ సంప్రదాయాల ప్రకారం హిందువులంతా పండుగలు, పబ్బాలు, ఇష్టమైన వారాల్లోనో లేదా పూజలు, వ్రతాలప్పుడు కచ్చితంగా గుడికి వెళ్తుంటారు. స్వామి వారి అనుగ్రహం పొందేందుకు కొబ్బరి కాయలు కొట్టడం, ప్రసాదాల సమర్పించడం మనకు తెలిసిన విషయమే. అయితే అక్కడ మనకు దేవుడుకి మధ్య అనుసంధాన కర్తగా పనిచేసే పూజారి తీర్థ ప్రసాదాలను అందజేసి మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. అయితే మనం తీర్థం తీసుకునేటప్పుడు పూజారి మూడు సార్లు తీర్థం అందజేస్తారు. ఒకవేళ మనం ఒకసారి వేయగానే చేయి వెనక్కి తీసుకున్నా మూడు సార్లు తీసుకోవాలని పూజారి మనకు చెప్తుంటాడు. అయితే స్వామివారి తీర్థం మూడు సార్లు ఇవ్వడం వెనక గల కారణం ఏమిటి? తీర్థం తీసుకునేటప్పుడు ఎడమ చేతిలో కుడి చేయి పెట్టి తీర్థం ఎందుకు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు పురోహితులు అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర దుర్గావిష్ణు పాదోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్ధాన్ని మూడు సార్లు భక్తులు చేతిలో వేస్తారు. అవి అకాల మరణాన్ని తప్పించే శక్తి, అన్ని రోగాల నివారణ, పాపక్షయం కనుక తీర్థాన్ని స్వీకరించి భక్తుడు స్వచ్ఛమైన మనసుతో దేవునిపై దృష్టి ఉంచి తీర్థాన్ని స్వీకరించాలని వేద పండితులు వివరిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల భక్తులకు శుభ ఫలితాలు కలుగుతాయట. అయితే మూడు సార్లు తీర్థం వేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే… మొదటి సారి తీర్థం తీసుకోవడం వల్ల మానసిక, శారీరక శుద్ధి జరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా రెండవ సారి తీర్థం తీసుకోవడం వల్ల న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయట. అంతే కాకుండా మూడవ సారి తీర్థం స్వీకరించడం వల్ల పరమేశ్వరుడి కృప మనపై ఉంటుందట. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింప చేసేదని అర్థం.
the secret behind giving Theertham three times
కాబట్టి ఆలయాన్ని సందర్శించిన భక్తులు ఈ విధంగా మూడు సార్లు తీర్థం తీసుకోవటం వల్ల భోజనం చేసినంత శక్తిని లభిస్తుందని మన పెద్దలు చెబుతుంటారు.అదే విధంగా తీర్థం తీసుకునే సమయంలో ప్రతి భక్తుడు ఎడమ చేతిలో కుడి చేయి పెట్టుకొని… కుడి చేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని సేవించడం వల్ల కళ్లు, బ్రహ్మ రంధ్రం, తల, మెడను తాకుతాయి. ప్రసాదం అనేది పృథ్వితత్వం అనే అంశంతో ముడిపడి ఉంటుంది. దీని వల్ల చైతన్యం, శక్తి కలుగుతాయి. అదే విధంగా తీర్ధం తీసుకున్న తర్వాత చాలా మంది చేతితో తలపై తాకుతుంటారు. కానీ ఇలా అస్సలే చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే తలలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఎంగిలి చేయితో బ్రహ్మను తాకండ మహా పాపం. అందుకే తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని కళ్ళకు అద్దుకోవడం ఎంతో మంచిదని వివరిస్తున్నారు.
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
This website uses cookies.