SS Rajamouli : ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎస్ఎస్ రాజమౌళి చేయ‌నున్న ప్రాజెక్ట్ ఏంటి? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎస్ఎస్ రాజమౌళి చేయ‌నున్న ప్రాజెక్ట్ ఏంటి?

SS Rajamouli : కెరీర్‌లో ఫ్లాప్ అనేది లేకుండా వ‌రుస విజ‌యాలని త‌న ఖాతాలు వేసుకుంటున్న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. బాహుబ‌లి సినిమాతో భారీ హిట్ కొట్టిన రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన ఈ సినిమా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కావ‌లసి ఉన్నా , క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. అయితే రాజ‌మౌళితి సినిమా అంటే హీరోలు సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి కాల్షీట్స్ కేటాయించాల్సిందే. ప్ర‌భాస్ 5 సంవ‌త్స‌రాలు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :8 January 2022,8:20 pm

SS Rajamouli : కెరీర్‌లో ఫ్లాప్ అనేది లేకుండా వ‌రుస విజ‌యాలని త‌న ఖాతాలు వేసుకుంటున్న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. బాహుబ‌లి సినిమాతో భారీ హిట్ కొట్టిన రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన ఈ సినిమా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కావ‌లసి ఉన్నా , క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. అయితే రాజ‌మౌళితి సినిమా అంటే హీరోలు సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి కాల్షీట్స్ కేటాయించాల్సిందే. ప్ర‌భాస్ 5 సంవ‌త్స‌రాలు కేటాయిస్తే ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్ దాదాపు మూడు సంవ‌త్స‌రాల పాటు ఈ సినిమాని అంటిపెట్టుకు కూర్చున్నారు.

ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా స్థాయి మూవీని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. హాలీవుడ్ స్థాయి యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీ గురించి ఇటీవల ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సందర్భంగా రాజమౌళి వెల్లడించారు కూడా.అయితే మ‌హేష్ మూవీ చేసే లోపు మ‌రోవైపు చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఆ సినిమా ఏ హీరోతో అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న క్ర‌మంలో రణ్‌బీర్ క‌పూర్ ఫ్రేంలోకి వ‌చ్చింది. రణ్ బీర్ కపూర్ నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` తెలుగు వెర్షన్ కి రాజమౌళి భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.ఈ సందర్భంగానే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని , ఆ క్ర‌మంలోనే మహేష్ ప్రాజెక్ట్ ని పక్కన

After RRR SSrajamouli next project

After RRR SSrajamouli next project

SS Rajamouli : రాజ‌మౌళి, ర‌ణ్‌బీర్‌ని క‌లిపిన బ్ర‌హ్మాస్త్రా

పెట్టి రాజమౌళి బాలీవుడ్ ఆడియన్స్ కోసం ర‌ణ్‌బీర్ కపూర్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించ‌నున్నార‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. ఇదే జ‌రిగితే మ‌హేష్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఇంకెన్నాళ్లు వేచి చూడాలో మ‌రి. ప్ర‌స్తుతం మహేష్ `సర్కారు వారి పాట` చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ భారీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాని మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి 14 ప్లస్ రీల్స్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1న విడుద‌ల కానుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది