SS Rajamouli : కెరీర్లో ఫ్లాప్ అనేది లేకుండా వరుస విజయాలని తన ఖాతాలు వేసుకుంటున్న దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో భారీ హిట్ కొట్టిన రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా జనవరి 7న విడుదల కావలసి ఉన్నా , కరోనా వలన వాయిదా పడింది. అయితే రాజమౌళితి సినిమా అంటే హీరోలు సంవత్సరాల తరబడి కాల్షీట్స్ కేటాయించాల్సిందే. ప్రభాస్ 5 సంవత్సరాలు కేటాయిస్తే ప్రభాస్, రామ్ చరణ్ దాదాపు మూడు సంవత్సరాల పాటు ఈ సినిమాని అంటిపెట్టుకు కూర్చున్నారు.
ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా స్థాయి మూవీని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. హాలీవుడ్ స్థాయి యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీ గురించి ఇటీవల ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సందర్భంగా రాజమౌళి వెల్లడించారు కూడా.అయితే మహేష్ మూవీ చేసే లోపు మరోవైపు చేయబోతున్నాడని సమాచారం. ఆ సినిమా ఏ హీరోతో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో రణ్బీర్ కపూర్ ఫ్రేంలోకి వచ్చింది. రణ్ బీర్ కపూర్ నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` తెలుగు వెర్షన్ కి రాజమౌళి భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.ఈ సందర్భంగానే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని , ఆ క్రమంలోనే మహేష్ ప్రాజెక్ట్ ని పక్కన
పెట్టి రాజమౌళి బాలీవుడ్ ఆడియన్స్ కోసం రణ్బీర్ కపూర్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నారని ప్రచారం నడుస్తుంది. ఇదే జరిగితే మహేష్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఇంకెన్నాళ్లు వేచి చూడాలో మరి. ప్రస్తుతం మహేష్ `సర్కారు వారి పాట` చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ భారీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాని మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి 14 ప్లస్ రీల్స్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల కానుంది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.