Aishwarya Rai receive legal notice
Aishwarya Rai : బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పటి మాజీ మిస్ ఇండియా అయిన ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది. తెలుగులో కూడా కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఐశ్వర్య రాయ్ కి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఐశ్వర్య చాలా కాలం క్రింద సిన్నార్ లో ఒక భూమిని కొనుగోలు చేసింది.
ఆ భూమికి సంబంధించిన టాక్స్ కట్టకపోవడంతో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. దాదాపుగా ఏడాది నుంచి ఆ భూములకు సంబంధించిన టాక్స్ కట్టకపోవడంతో ఈ విధంగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఐశ్వర్యరాయ్ తో పాటు మరో 1200మంది కూడా టాక్స్ కట్టకపోవడంతో నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న వారిలో పెద్ద కంపెనీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళందరూ టాక్స్ కట్టకపోవడంతో ప్రభుత్వానికి 1.11 కోట్ల నా నష్టం వచ్చిందట.
Aishwarya Rai receive legal notice
దీంతో మార్చ్ లోపు టాక్స్ కట్టాలని ప్రభుత్వం నోటీస్ లు జారీ చేసింది. ఐశ్వరరాయ్ మొత్తంగా రూ.21,960 పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని తెలుస్తోంది. పది రోజుల్లో కట్టకపోతే మహారాష్ట్ర భూ రెవెన్యూ చట్టం ప్రకారం ఐశ్వర్య పైన చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలిపింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇకపోతే ఐశ్వర్య ఇటీవల పోన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.
Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…
Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
This website uses cookies.