Allu Arjun : స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్
ప్రధానాంశాలు:
Allu Arjun : స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్
Allu Arjun : అల్లు అర్జున్ ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తున్నారు. ఎక్కువగా వివాదాలతో వార్తలలో నిలుస్తూ ఉండే బన్నీ రీసెంట్గా అరెస్ట్ అయ్యాడు కూడా.ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చంచల్గూడ జైలు నుంచి విడుదల అయిన వెంటనే భారీ బందోబస్తు మధ్య గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఆయనకు శుక్రవారం సాయంత్రమే నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 50 వేల రూపాయల పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. అయినప్పటికీ- విడుదల ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల రాత్రంతా జైలులో గడపాల్సి వచ్చింది. ఈ పరిణామాన్ని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది జీ అశోక్ రెడ్డి తప్పు పట్టారు. చంచల్ గూడ సెంట్రల్ జైలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. లీగల్గా ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

Allu Arjun : స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్
Allu Arjun మెగా- అల్లు కలయిక..
ఇదిలా ఉంటే బన్నీ అరెస్ట్ విషయం తెలియగానే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన బన్నీ ఇంటికి వచ్చిన చిరంజీవి.. బన్నీ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత వెంటనే చిక్కడపల్లి స్టేషన్కు చిరంజీవి వెళ్లాలనుకున్నారు. కానీ పోలీసులు వద్దని కోరటంతో అర్జున్ ఇంటి దగ్గరకు వెళ్లిన చిరంజీవి దంపతులు. శనివారం ఉదయం విడుదలైన బన్నీని నిన్న టాలీవుడ్ సినీప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు బన్నీ. మెగా ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ లంచ్ చేయనున్నారు. అనంతరం సంధ్య థియేటర్ ఘటన గురించి చిరంజీవితో మాట్లాడనున్నారు బన్నీ. పుష్ప 2 సక్సెస్ తరువాత తొలిసారి చిరంజీవిని కలుస్తున్నారు అల్లు అర్జున్.
ఇక పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వచ్చి..ఏపీకి వెళ్లిపోయారు ..నిన్న రాత్రి హైదరాబాద్ కు వచ్చిన పవన్ కళ్యాణ్….ఈ రోజు ఉదయం విజయవాడకి తిరిగి వెళ్లిపోయారు. ఇందులో భాగంగానే… గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే.. హైదరాబాద్ కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… ఇప్పటికీ అల్లు అర్జున్ కలిసి పరామర్శించలేదు. మళ్లీ ఏపీకి తిరిగి వెళ్లిపోయారు. దీంతో అల్లు కుటుంబం షాక్ లో ఉంది. మెగా ఫ్యామిలీ కి అల్లు ఫ్యామిలీకి పడడం లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవి- బన్నీ కలయిక చర్చనీయాంశంగా మారింది.