Anasuya : సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే బ్రహ్మాజీ అప్పుడప్పుడు ఆసక్తికర విషయాలు షేర్ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. ఆయన చేసే ట్వీట్స్ ఒక్కోసారి చర్చనీయాంశంగా కూడా మారుతుంటాయి. రీసెంట్గా ఎయిర్లైన్స్పై ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రహ్మాజీ ‘వాట్స్ హ్యాపెనింగ్’ (ఏం జరుగుతోంది?) అని తన సెల్ఫీని పోస్టు చేస్తూ అభిమానులను అడిగాడు. అది చూసిన ఓ అభిమాని ‘ఏం లేదు అంకుల్’ అని బదులిచ్చాడు. ఆ రిప్లై చూసిన బ్రహ్మాజీ దానిని రీ ట్వీట్ చేస్తూ ‘అంకులేంట్రా అంకుల్. కేసు వేస్తా, బాడీ షేమింగ్ చేస్తున్నావా?’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జతచేశారు. అంతే.. క్షణాల్లోనే అది వైరల్ అయింది. అభిమానులు సరదా కామెంట్లతో ట్విట్టర్ను హోరెత్తించారు.
ఆంటీని మళ్లీ రెచ్చగొట్టారని ఒకరంటే.. ఎన్ని కేసులు వేస్తానని బెదిరించినా ఆ ఆంటీకి వచ్చినంత పేరు మాత్రం మీకు రాదని ఇంకొకరు కామెంట్ చేశారు. ‘#SayNotToOnlineAbuse అనే హ్యాష్ట్యాగ్ మర్చిపోయారు అంకుల్’ అని మరొకరు.. ఇలా కామెంట్ల వర్షం కురిపించారు. అసలు విషయం లోకి వెళితే లైగర్ సినిమా రిలీజ్ రోజున యాంకర్ అనసూయ వేసిన ట్వీట్పై దుమారం రేగింది. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. కర్మ కచ్చితంగా వెంటాడి తీరుతుంది’ అంటూ ట్వీట్ చేసింది అనసూయ. అయితే గతంలో అర్జున్ రెడ్డి సినిమా అప్పుడు విజయ్ ఫ్యాన్స్కి అనసూయకి మధ్య పెద్ద వివాదమే నడిచింది.
అనసూయ కామెంట్స్ కి సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ ఆమెను ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆమెను ఆంటీ.. ఆంటీ అని పచ్చి బూతులు తిడుతూ ట్వీట్లు చేయడంతో అనసూయ దారుణంగా ట్రోలింగ్కి గురైంది. దీంతో అనసూయ తగ్గేదే లే అన్నట్టుగా.. తనని ట్రోల్ చేసేవారికి కౌంటర్లు ఇస్తూ వచ్చింది. ఆంటీ అన్న వాళ్లపై కేసులు పెడతానని హెచ్చరించింది. దీంతో ట్రోలర్స్ వెనక్కి తగ్గకుండా ఆమెను ఆంటీ అంటూ రెట్టింపు ట్రోలింగ్ చేశారు. దీంతో అనసూయ నేషనల్ ట్రెండింగ్లో నిలిచింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.