airline company run by Anasuya
Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినిమాలు, సోషల్ మీడియా,బుల్లితెరపై మంచి వినోదం పంచుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి సోషల్ మీడియాలో అనసూయ చేసే కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. తాజాగా అనసూయ ఆసక్తికర కామెంట్స్ చేయగా, ప్రస్తుతం దీనిపై అందరు ఆసక్తికర చర్చ జరుపుతున్నారు. వివరాలలోకి వెళితే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ క్రేజీ కాంబినేషన్ లో భారీ అంచనాలతో లైగర్ చిత్రం నేడు విడుదలయింది. ఈ చిత్రంపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
పూరి జగన్నాధ్ మరోసారి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు. హిందీలో కూడా ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అంటూ ఒక రేంజ్ లో హైప్ నెలకొంది. మసిపూసి మారేడు చేసినట్లు ప్రమోషన్స్ తో హైప్ తెచ్చుకున్నారు. కానీ సినిమాలు ఏమీ లేదంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. పూరి జగన్నాధ్ తో పాటు విజయ్ దేవరకొండ పై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. బోల్డ్ యాటిట్యూడ్ అన్ని సమయాల్లో వర్కౌట్ కాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనసూయ చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా స్టార్ యాంకర్, నటి అనసూయ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. అనసూయ ట్విట్టర్ వేదికగా చేసిన ఈ కామెంట్స్ విజయ్ దేవరకొండని ఉద్దేశించే అంటూ నెటిజన్లు డిసైడ్ అవుతున్నారు.
anasuya indirect comments viral
ఇంతకీ అనసూయ ఏమందంటే.. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా ..ఎదుటివారి బాధని చూసి సంతోష పడడం లేదు కానీ ధర్మమే గెలిచింది’ అంటూ అనసూయ ట్వీట్ చేసింది. అర్జున్ రెడ్డి చిత్రంలో అమ్మని తిట్టినట్లుగా ఉండే ఒక బూతు డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అర్జున్ రెడ్డి మూవీ సమయంలో ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందో అందరికి తెలిసిందే. ఆ డైలాగ్ ని అనసూయ కూడా వ్యతిరేకిస్తూ మీడియాకి ఎక్కింది ఇలాంటి వాటికి తానూ వ్యతిరేకం అంటూ అనసూయ అప్పట్లో మీడియా డిబేట్స్ లో తెలిపింది. అప్పుడు అమ్మని ఉద్దేశించి చెడుగా పెట్టిన డైలాగ్.. ఇప్పుడు కర్మ రూపంలో లైగర్ మూవీగా తిరిగి వచ్చింది అని అర్థం వచ్చేలా అనసూయ కామెంట్స్ ఉన్నాయి.
Mahaabhaaratam : మహాభారతం Mahaabhaaratam అంటే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుని లీలలు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పే మంచి మాటలే మహాభారతం.…
New Villain : ఈ మధ్య సినీ పరిశ్రమకి కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కుబేర లో నటించిన విలన్…
Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
This website uses cookies.