
airline company run by Anasuya
Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినిమాలు, సోషల్ మీడియా,బుల్లితెరపై మంచి వినోదం పంచుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి సోషల్ మీడియాలో అనసూయ చేసే కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. తాజాగా అనసూయ ఆసక్తికర కామెంట్స్ చేయగా, ప్రస్తుతం దీనిపై అందరు ఆసక్తికర చర్చ జరుపుతున్నారు. వివరాలలోకి వెళితే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ క్రేజీ కాంబినేషన్ లో భారీ అంచనాలతో లైగర్ చిత్రం నేడు విడుదలయింది. ఈ చిత్రంపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
పూరి జగన్నాధ్ మరోసారి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు. హిందీలో కూడా ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అంటూ ఒక రేంజ్ లో హైప్ నెలకొంది. మసిపూసి మారేడు చేసినట్లు ప్రమోషన్స్ తో హైప్ తెచ్చుకున్నారు. కానీ సినిమాలు ఏమీ లేదంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. పూరి జగన్నాధ్ తో పాటు విజయ్ దేవరకొండ పై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. బోల్డ్ యాటిట్యూడ్ అన్ని సమయాల్లో వర్కౌట్ కాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనసూయ చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా స్టార్ యాంకర్, నటి అనసూయ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. అనసూయ ట్విట్టర్ వేదికగా చేసిన ఈ కామెంట్స్ విజయ్ దేవరకొండని ఉద్దేశించే అంటూ నెటిజన్లు డిసైడ్ అవుతున్నారు.
anasuya indirect comments viral
ఇంతకీ అనసూయ ఏమందంటే.. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా ..ఎదుటివారి బాధని చూసి సంతోష పడడం లేదు కానీ ధర్మమే గెలిచింది’ అంటూ అనసూయ ట్వీట్ చేసింది. అర్జున్ రెడ్డి చిత్రంలో అమ్మని తిట్టినట్లుగా ఉండే ఒక బూతు డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అర్జున్ రెడ్డి మూవీ సమయంలో ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందో అందరికి తెలిసిందే. ఆ డైలాగ్ ని అనసూయ కూడా వ్యతిరేకిస్తూ మీడియాకి ఎక్కింది ఇలాంటి వాటికి తానూ వ్యతిరేకం అంటూ అనసూయ అప్పట్లో మీడియా డిబేట్స్ లో తెలిపింది. అప్పుడు అమ్మని ఉద్దేశించి చెడుగా పెట్టిన డైలాగ్.. ఇప్పుడు కర్మ రూపంలో లైగర్ మూవీగా తిరిగి వచ్చింది అని అర్థం వచ్చేలా అనసూయ కామెంట్స్ ఉన్నాయి.
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
This website uses cookies.